Monday, May 6, 2024

ఒకే ఓవ‌ర్లో నాలుగు వికెట్లు..

తప్పక చదవండి
  • శ్రీ‌లంక‌ నడ్డి విరిచిన భారత బౌలర్ సిరాజ్..

కొలంబో : ఆసియా క‌ప్ ఫైన‌ల్లో టీమిండియా స్టార్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ శ్రీ‌లంక‌కు చుక్క‌లు చూపిస్తున్నాడు. ఈ స్పీడ్‌స్ట‌ర్ మూడు ఓవ‌ర్ల‌లోనే ఐదు వికెట్లు తీసి లంక‌ను చావు దెబ్బ కొట్టాడు. ఏకంగా ఓకే ఓవ‌ర్లో నాలుగు కీల‌క‌ వికెట్లు తీశాడు. దాంతో, ఈ ఫీట్ సాధించిన తొలి భార‌త బౌల‌ర్‌గా సిరాజ్ రికార్డు సృష్టించాడు. అంతేకాదు ఆ త‌ర్వాతి ఓవ‌ర్లో అద్భుత బంతితో లంక కెప్టెన్ ద‌సున్ శ‌న‌క‌(0)ను బౌల్డ్ చేశాడు. సిరాజ్ ధాటికి న‌లుగురు శ్రీ‌లంక బ్యాట‌ర్లు ఖాతా తెర‌వ‌కుండానే పెవిలియ‌న్ చేరారు. నాలుగో ఓవర్లో సిరాజ్ నిప్పులు చెరిగాడు. తొలి బంతికే ఓపెన‌ర్ పథుమ్ నిస్సంక‌(2)ను ఔట్ చేశాడు. ఆ త‌ర్వాత మూడో బంతికి స‌ధీర స‌మ‌ర‌విక్ర‌మ‌(0)ను, నాలుగో బంతికి చ‌రిత అస‌లంక‌(0)ను ఔట్ చేసి హ్యాట్రిక్‌పై నిలిచాడు. అయితే.. ధ‌నంజ‌య డిసిల్వా(4) ఐదో బంతికి బౌండ‌రీ కొట్టాడు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు