- ఆర్బీఐ మాజీ గవర్నర్ రంగరాజన్ వెల్లడి..
న్యూ ఢిల్లీ : ఉద్యోగాల్లేని వృద్ధి ఎందుకని ప్రశ్నించారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్, ప్రముఖ ఆర్థికవేత్త సీ రంగరాజన్. ఉపాధి కల్పన దిశగా భారత ఆర్థిక వ్యవస్థ పురోగమించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. శనివారం ఇక్కడి నార్సింగిలోని ఓం కన్వెన్షన్లో నిర్వహించిన ఇక్ఫాయ్ 13వ స్నాతకోత్సవానికి రంగరాజన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగడం బాగానే ఉన్నా.. ఉద్యోగ-ఉపాధి అవకాశాలను సరిపడా సృష్టించలేని ఆ వృద్ధి దేనికంటూ పరోక్షంగా కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు.