Tuesday, April 30, 2024

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో డ్రగ్స్ దందా..

తప్పక చదవండి
  • నవదీప్ విచారణ తర్వాత మరో ఇద్దరు సినీ ప్రముఖులు అరెస్టు..
  • మరోసారి నవదీప్ ను విచారణకు పిలిచే అవకాశం..

హైదరాబాద్ : టాలీవుడ్‎లో మరోసారి డ్రగ్స్ దుమారం తెరపైకి వచ్చింది. గత ఏడాదిగా వరుసగా పట్టుబడుతున్న సినిమా వాళ్లను చూస్తే ఇండస్ట్రీలో డ్రగ్స్ ఏ స్థాయిలో కుదిపేస్తుందో అర్థం చేసుకోవచ్చు. 2017లో టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు భారీగా ప్రకంపనలు రేపింది. ఈ కేసు పై ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో సిట్ విచారణ చేపట్టింది. ఇందులో టాలీవుడ్ కి చెందిన అగ్ర దర్శక నిర్మాతలతో పాటు హీరో హీరోయిన్లు విచారణ ఎదుర్కొన్నారు. టాలీవుడ్ హీరో రవితేజ, రానా, నవదీప్,తరుణ్, తనీష్, సుబ్బరాజుతో పాటు హీరోయిన్లు చార్మి, రకుల్ ప్రీత్ సింగ్, ముమైత్ ఖాన్లు తోపాటు దర్శకుడు పూరి జగన్నాథ్ సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. అప్పటినుండి ఇప్పటివరకు ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు తరచుగా డ్రగ్స్ కేసులో పట్టుబడడం కలకలం సృష్టిస్తుంది. 2017 కేసులో పట్టుబడ్డ వ్యక్తులు మరోసారి పట్టుబడటంతో డ్రగ్స్‌కు ఏ రకంగా బానిసలుగా మారుతున్నారు అర్థం చేసుకోవచ్చు. సినిమాలో డబ్బు ఫేమ్ రాగానే కొందరు ఈ డ్రగ్స్ కల్చర్ కి అలవాటు పడుతున్నట్టు తెలుస్తుంది. ఫిట్‌నెస్ సౌందర్యం కోసం కూడా కొంతమంది డ్రగ్స్ కి బానిసలుగా మారుతున్నట్టు నార్కోటిక్ పోలీసులు చెబుతున్నారు. సినీ ఇండస్ట్రీలలో జరిగే పార్టీ కల్చర్ లో వీటిని అలవాటు చేసుకుని మెల్లమెల్లగా డ్రగ్స్‎కు బానిసలుగా మారుతున్నారు. నిర్మాత కె.పి చౌదరి కేసు దర్యాప్తులో డ్రగ్స్ ఇండస్ట్రీలో ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. ఇండస్ట్రీలో అనేకమంది కెపీ చౌదరి నుండి డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు దర్యాప్తులో తేల్చారు. ఇటీవల మాదాపూర్ లో సోదాలు చేసిన నార్కోటిక్ పోలీసులు రామచంద్ అనే డ్రగ్ సప్లయర్ను రెడ్ హ్యాండెడ్గా డ్రగ్స్ తీసుకుంటుండగా అదుపులోకి తీసుకున్నారు. ఆయనను విచారిస్తే ఇండస్ట్రీకి చెందిన కీలక వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు. ప్రముఖ హీరో నవదీప్ తో కలిసి తరచుగా గోవా హైదరాబాదులో పార్టీలు నిర్వహించే వాడని నార్కోటిక్ పోలీసులు గుర్తించారు.

ఇదే క్రమంలో హీరో నవదీప్‎ను సుదీర్ఘంగా విచారించిన నార్కోటిక్ పోలీసులు ఆయన మొబైల్‎ను స్వాధీనం చేసుకున్నారు. నార్కోటిక్ పోలీసుల దర్యాప్తుకు హాజరు కంటే ముందు ఆయనే మొబైల్లో ఉన్న ఆధారాలన్నిటిని చెరిపేసినట్టు పోలీసులు చెబుతున్నారు. ఫోరెన్సిక్ నివేదిక తర్వాత నార్కోటిక్ పోలీసులు నవదీప్ ను మరోసారి విచారించేందుకు సిద్ధమవుతున్నారు ఆయనే రెండు ఫోన్లో ఫార్మర్ చేసిన వివరాలు బయటకు వస్తే ఇండస్ట్రీలో ఉన్న మరి కొంతమంది పాత్ర బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు నార్కోటిక్ పోలీసులు. మరోవైపు బస్తీ సినిమా నిర్మాత మంతెన వాసుతో పాటు రైటర్ పృథ్విని కూకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. మంతెన వాసు పోలీసులు సోదాలు చేసేటువంటి క్రమంలో అప్పటికే డ్రగ్స్ తీసుకుని ఉన్నట్టుగా తేలడంతో ఆయనను కన్జ్యూమర్‎గా చేర్చారు పోలీసులు. అలాగే రైటర్ పృథ్వి ఇంట్లో ఎక్సైజ్ పోలీసులతో కలిసి కూకట్పల్లి పోలీసులు దాడులను నిర్వహిస్తే ఆయన నివాసంలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇలా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు తరచుగా డ్రగ్స్ కేసులో పట్టుబడడం సంచలనం సృష్టిస్తుంది. డ్రగ్స్ అంశం ఎప్పుడు తరం మీదికి రావడంతో ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు పట్టుబడడం సాధారణంగా మారింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు