టీమ్ ఇండియా 2023 లో ఏట్రోఫీని గెలుచుకోకపోవచ్చు. కానీ, ఈ సంవత్సరం భారత జట్టుకు అద్భుతంగా ఉంది. ఈ ఏడాది టీ20 నుంచి వన్డే, టెస్టు ఫార్మాట్ల వరకు మొత్తం 11 ద్వైపాక్షిక సిరీస్లు ఆడిన టీమ్ ఇండియా అందులో 9 సిరీస్లను గెలుచుకుంది. దీంతో పాటు ఈ ఏడాది జరిగిన రెండు ఐసీసీ టోర్నీల్లోనూ ఫైనల్స్కు చేరుకుంది. శ్రీలంకతో వన్డే సిరీస్తో భారత జట్టుకు కొత్త సంవత్సరం ప్రారంభమైంది. ఇక్కడ శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్ను ఆతిథ్య భారత్ క్లీన్ స్వీప్ చేసింది. ఆ తర్వాత, భారత జట్టు తన సొంత గడ్డపై న్యూజిలాండ్తో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను కూడా 3-0 తేడాతో ఏకపక్షంగా కైవసం చేసుకుంది. అయితే, మార్చిలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో టీమిండియా 1-2తో సొంత మైదానంలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. దీంతో సెప్టెంబర్లో జరిగిన వన్డే సిరీస్లో కంగారూలను ఓడిరచి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ప్రపంచకప్నకు ముందు జరిగిన ఈ సిరీస్లో భారత్ 2-1తో ఆస్ట్రేలియాను ఓడిరచింది. మరోవైపు వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్ను కూడా భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ ఏడాది భారత్ నాలుగు టీ20 సిరీస్లు ఆడిరది. జనవరిలో శ్రీలంకను 2-1తో ఓడిరచిన టీమ్ ఇండియా ఆ తర్వాత వెంటనే 2-1తో న్యూజిలాండ్ను ఓడిరచింది. ఆగస్టులో వెస్టిండీస్ పర్యటనలో 2-3 తేడాతో ఓటమిని చవిచూసింది. ఆ తర్వాత టీ20 సిరీస్లో ఐర్లాండ్ను 2-0తో, తాజాగా ఆస్ట్రేలియాను 4-1తో టీమిండియా ఓడిరచింది. ఈ ఏడాది భారత్ కేవలం రెండు టెస్టు సిరీస్లను మాత్రమే గెలుచుకుంది. మొదటి టెస్ట్ సిరీస్ ఆస్ట్రేలియాతో జరిగింది. ఇందులో భారత జట్టు నాలుగు మ్యాచ్ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 2-1తో గెలుచుకుంది. ఆ తర్వాత, జులైలో వెస్టిండీస్ పర్యటనలో, టీమిండియా ఆతిథ్య జట్టును టెస్ట్ సిరీస్లో 1-0తో ఓడిరచింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ను కోల్పోయింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ చివరి మ్యాచ్లో ఆస్ట్రేలియాను భారత్ ఎదుర్కొంది. ఇంగ్లండ్లోని ఓవల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా ఏకపక్షంగా ఓడి వరుసగా రెండోసారి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ టైటిల్ను చేజార్చుకుంది. నవంబర్లో జరిగిన ప్రపంచకప్లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. భారత జట్టు తన అన్ని మ్యాచ్లను ఏకపక్ష పద్ధతిలో గెలిచి ఫైనల్స్కు చేరుకుంది. అయితే ఇక్కడ భారత జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఇలా పదేళ్ల తర్వాత మరోసారి ఐసీసీ ట్రోఫీని చేజిక్కించుకోవాలనే కల కలగానే మిగిలిపోయింది. భారత జట్టు ఈ ఏడాది ఐసీసీ టోర్నీలను గెలవలేకపోయినా.. ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఆతిథ్య శ్రీలంకను ఏకపక్షంగా ఓడిరచి ఆసియా కప్ ట్రోఫీని కైవసం చేసుకుంది.