- తీవ్ర విమర్శలు చేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి..
హైదరాబాద్ : రైతుబంధును ఆపాలని ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేయడంతో కాంగ్రెస్ రైతు వ్యతిరేఖ పార్టీ అని మరోసారి రుజువైందని అటవీ, పర్యావరణ, శాఖ మంత్రిఇంద్రకరణ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తుందని, తెలంగాణ రైతాంగం, తెలంగాణ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాలి అని కోరారు. జిల్లాలోని శాస్త్రినగర్లో గల క్యాంప్ కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ… ఈసీకి ఫిర్యాదుతో రైతాంగం పట్ల కాంగ్రెస్ పార్టీ కపట ప్రేమ బట్టబయలైందన్నారు. రైతాంగానికి నష్టం చేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నిలదీయాలని పిలుపునిచ్చారు. రైతుబంధుపై అన్నదాతలు ఎలాంటి ఆందోళన చెందవద్దని, ఎప్పటిలాగే ప్రభుత్వం యాసంగి పంట సాయాన్ని నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తుందని తెలిపారు. రైతుబంధును ఆపాలని కాంగ్రెస్ పార్టీ చూడటం సరైందని కాదని వ్యాఖ్యానించారు.