- ప్రజాకర్షక పథకాలతో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో
- అమరుల కుటుంబ సభ్యులకు రూ. 25 వేల పింఛను
- ప్రతి ఆటో డ్రైవర్కు ఏడాదికి రూ. 12 వేల ఆర్థిక సాయం
- దివ్యాంగుల పింఛన్ రూ. 5,016, ఉచిత ఆర్టీసీ ప్రయాణం
- మరణించిన జర్నలిస్ట్ కుటుంబాలకు రూ. 2 లక్షలు
- ధరణి స్థానంలో భూమాత.. 24 గంటల ఉచిత విద్యుత్
- ఆరు నెలల్లోపు మెగా డీఎస్సీ.. 2 లక్షల ఉద్యోగాలు
- అభయహస్తం పేరుతో మేనిఫెస్టో విడుదల చేసిన ఖర్గే
హైదరాబాద్ : అభయహస్తం పేరుతో తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేసింది. గాంధీభవన్ లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మ్యానిఫెస్టో విడుదల చేశారు. 42 పేజీల కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో 66 కీలక అంశాలను పొందుపర్చారు. 6 గ్యారంటీలకు అనుబంధంగా 66 హామీలిచ్చింది. పోలింగ్కు మరో 13 రోజులు మాత్రమే ఉండటంతో ప్రచారంలో దూసుకెళ్తుంది. ఇక ఆరు గ్యారంటీలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హస్తం పార్టీ వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా వాటిని ప్రజల్లోకి తీసుకెళ్తుంది. మహాలక్ష్మి స్కీమ్, రైతుభరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం, చేయూత పేరుతో ఆరు గ్యారంటీలను ప్రకటించిన కాంగ్రెస్.. తాజాగా ఎన్నికల మేనిఫెస్టోను కూడా విడుదల చేసింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గాంధీ భవన్లో మేనిఫెస్టోను విడుదల చేశారు. తాము అందరికీ లబ్ధి చేకూరేలా పీపుల్స్ మేనిఫెస్టో రూపొందించినట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెల్లడిరచారు. ఈ మేనిఫెస్టో కాంగ్రెస్కు భవద్గీత, ఖురాన్, భైబిల్ అని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి ర్షాగానే ప్రతీ హామీని అమలు చేస్తామని అన్నారు. రాష్ట్ర సంపదను పేదలకు పంచేలా మేనిఫెస్టోను రూపొందించినట్లు చెప్పారు. మహిళలను ఆకట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అనేక హామీలను గుప్పించింది. కర్ణాటక తరహాలో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది. అంతే కాకుండా కళ్యాణమస్తు పథకంలో భాగంగా ఆడబిడ్డల వివాహానికి లక్ష రూపాలయ ఆర్థిక సాయంతోపాటు ఇందిరమ్మ కానుకగా తులం బంగారం ఇస్తామని హస్తం పార్టీ మేనిఫెస్టోలో పేర్కొంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఏప్రిల్ ఒకటిన గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేస్తామని తేదీలతో సహా మేనిఫెస్టోలో పేర్కొనడం గమనార్హం. జూన్ 1న గ్రూప్-3, గ్రూప్-4 నియామకాలకు నోటిఫికేషన్ వెల్లడిస్తామని తెలిపింది. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు విడతల్లో 2 లక్షల ఉద్యోగాలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.
మేనిఫెస్టోలోని ముఖ్యమైన హామీలు
- తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులకు రూ.25 వేల పింఛను ఆయా కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం
- ఉద్యమకారులపై కేసులు ఎత్తివేసి 250 గజాల ఇళ్ల స్థలం
- రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యం పంపిణీ
- పెండిరగ్ చలాన్లు 50 శాతం రాయితీతో పరిష్కారం
- వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్
- రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల పంట రుణమాఫీ
- రైతులకు రూ.3 లక్షల వడ్డీ లేని రుణాలు
- రైతు కూలీలకు రూ. 12 వేలు
- అన్ని పంటలకు మద్దతు ధర
- చక్కెర కర్మాగారాలు, పసుపు బోర్డు ఏర్పాటు
- భూమిలేని రైతులకు సైతం రైతు బీమా
- ధరణీ స్థానంలో ‘భూమాత’ పోర్టల్
- వార్షిక జాబ్ క్యాలెండర్ ద్వారా రూ.2 లక్షల ఉద్యోగాల భర్తీ
- ఆడపిల్లల పెళ్లికి రూ.లక్షతో పాటు 10 గ్రాముల బంగారం.
- కాలేజీకి వెళ్లే విద్యార్థులకు విద్యా భరోసా కింద రూ.5 లక్షలు
- 18 ఏళ్లు పైబడిన ప్రతి విద్యార్థికి స్కూటీ
- నిరుద్యోగుల కోసం యూత్ కమిషన్.. రూ. 10 లక్షలు వడ్డీ లేని రుణం
- నిరుద్యోగ యువతకు నెలకు రూ. 4 వేల నిరుద్యోగ భృతి
- దివ్యాంగుల నెలవారీ పెన్షన్ రూ. 6 వేలకు పెంపు
- అంగన్వాడీ టీచర్లకు నెలకు రూ. 18 వేల వేతనం
- ఎస్సీ రిజర్వేషన్లు 18 శాతానికి పెంపు
- కొత్తగా మూడు ఎస్టీ, మూడు ఎస్సీ కార్పొరేషన్లు ఏర్పాటు
- ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ. 12 లక్షల ఆర్థిక సాయం
- ఇళ్లులేని ప్రతి కుటుంబానికి ఇంటి స్థలంతో పాటు రూ. 6 లక్షల నిధులు
- మధ్యాహ్న భోజన కార్మికుల వేతనం రూ. 10 వేలకు పెంపు
- 50 ఏళ్లు పైబడిన జానపద కళాకారులకు రూ. 3 వేల పెన్షన్
- మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ. 5 లక్షలు
- రేషన్ డీలర్లకు రూ. 5 వేల గౌరవ వేతనం
- మరణించిన గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ. 5 లక్షలు పరిహారం
- ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రతిరోజూ ‘ప్రజాదర్భార్’ ఏర్పాటు
- ప్రతి మండలానికి మార్కెట్ యార్డు
- కాళేశ్వరం ముంప్ను రైతులకు ఆర్థిక సాయం
- ప్రతి జిల్లాలో కోతుల సంతాన నియంత్రణ కేంద్రాలు
- ఇబ్బందికర ఫార్మాసిటీల రద్దు.
- బీడీ కార్మికులకు జీవిత బీమా, ఈఎస్ఐ ఫరిది వర్తింపు
- ఎల్బీ నగర్-ఆరాంఘర్- మెహదీపట్నం- బీహెచ్ఈఎల్ రూట్లలో కొత్త మెట్రో మార్గం
తెలంగాణ ప్రజల బాగుకోసమే ఆరు గ్యారంటీ పథకాలు
తెలంగాణ ప్రజల బాగు కోసమే కాంగ్రెస్ మేనిఫెస్టో అని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. శుక్రవారం 36 అంశాంలతో తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టోను ఖర్గే విడుదల అనంతరం ఆయన మాట్లాడుతూ ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్లో కేసీఆర్ సర్కార్ అవినీతికి పాల్పడిరదని ఆరోపించారు. కొద్ది రోజులుగా కేసీఆర్కు భయం పట్టుకుందని.. ఆయన గొంతులో ఆందోళన కనిపిస్తున్నదని ఆయన తెలిపారు. మోడీ, కేసీఆర్ కలిసి ఎన్ని కుట్రలు పన్నినా కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని.. జనాలు ఇప్పటికే డిసైడ్ అయిపోయారని చెప్పుకొచ్చారు. ఎప్పుడూ ఫార్మ్ హౌస్లోనే ఉండే కేసీఆర్ ఇక.. అక్కడే ఉండిపోతారని.. జనాలు బై బై కేసీఆర్.. టాటా కేసీఆర్ అంటారని అన్నారు. విద్యార్థులు, ఉద్యోగుల బలిదానాలు చూసి సోనియా తెలంగాణ ఇచ్చారని తెలిపారు. జనాలు బాగు పడతారని తెలంగాణ ఇస్తే.. జనాలను దోచుకునే వాళ్లు రాజ్యమేలుతున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టులు, పథకాలు, ప్రతి దాంట్లోనూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. కర్ణాటకలో ఐదు గ్యారెంటీలను ఇచ్చినట్టే.. ఇక్కడా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని అన్నారు. కర్ణాటకలో చెప్పిన ప్రతి హామీనీ తాము నెరవేరుస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలను బరాబర్ అమలు చేసి తీరుతామని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేబినెట్ ఏర్పాటైన తొలి రోజే వాటిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ‘‘మా తొలి లక్ష్యం.. మహాలక్ష్మి పథకం.. ప్రతి నెలా రూ.2500, రూ.500కే గ్యాస్, బస్సుల్లో ఫ్రీ జర్నీ’’ అని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు.