తిరుపతి : సీఎం జగన్ తుపాను ప్రభావిత ప్రాంతాలైన తిరుపతి, బాపట్ల జిల్లాల్లో పర్యటించారు. శుక్రవారం ఉదయం ప్రత్యేక హెలికాఫ్టర్ లో తిరుపతి జిల్లాకు చేరుకున్న ఆయన, అధికారులతో కలిసి వాకాడు మండలం విద్యానగర్ వెళ్లారు. అనంతరం బాలిరెడ్డి పాలెం వెళ్లి అక్కడ స్వర్ణముఖి నది కట్ట తెగిన ప్రాంతాలను పరిశీలించారు. అక్కడి బాధిత గ్రామస్థులు, రైతులతో మాట్లాడారు. పంట నష్టం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తుపాను ప్రభావంపై ఫోటో ఎగ్జిబిషన్ ను సందర్శించారు. తర్వాత మురుప్రోలు వారిపాలెం, కర్లపాలెం, బుద్దాం గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులకు నేరుగా మాట్లాడనున్నారు. అంతకు ముందు తిరుపతి జిల్లాలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ వ్యూ ద్వారా దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.