Friday, May 17, 2024

ఏడేళ్లలో డబుల్‌ అయిన నగదు లావాదేవీలు

తప్పక చదవండి

న్యూఢిల్లీ : 2016 నవంబర్‌ 7న మోడీ ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్ల చలామణిని రద్దు చేసింది. నల్లధనాన్ని వెలికితీసేందుకే ఈ చర్య తీసుకున్నామని వివరణ ఇచ్చింది. ఆ తర్వాత నగదు లావాదేవీలను తగ్గించడానికి యూపీఐ, ఇతర డిజిటల్‌ చెల్లింపుల పద్ధ తులను ప్రవేశపెట్టింది. అయినప్పటికీ గత ఏడు సంవత్సరాల్లో దేశంలో నగదు చలామణి రెట్టింపు అయింది. 2016 నవంబరులో రూ.17 లక్షల కోట్ల నగదు చలామణిలో ఉండగా ఈ ఏడాది అక్టోబర్‌ లో అది రూ.33 లక్షల కోట్లకు పెరిగింది. దేశంలో 363 జిల్లాలకు చెందిన 44 వేల మంది అభిప్రాయాలను సేకరించి జరిపిన ఓ సర్వేలో ఈ విషయాలు వెలుగుచూశాయి. మే నెలలో దేశంలో జరిగిన మొత్తం రిటైల్‌ డిజిటల్‌ చెల్లింపుల్లో 78శాతానికి పైగా యూపీఐ ద్వారానే జరిగాయి. అయినప్పటికీ గత ఏడేళ్లలో ఆస్తులు కొనుగోలు చేసిన వారిలో 76శాతం మంది కొంత మొత్తాన్ని నగదు రూపంలోనే చెల్లించారు. పెద్ద మొత్తంతో కూడిన లావాదేవీలు ముఖ్యంగా ఆస్తుల కొనుగోళ్లకు నగదు చెల్లింపులే జరిగాయని సర్వే తెలిపింది. యూపీఐ ద్వారా రూ.17.6 లక్షల కోట్ల విలువైన 1,140 కోట్ల లావాదే వీలు జరిగినప్పటికీ సర్వేలో పాల్గొన్న 15శాతం మంది తాము 50శాతం వరకూ చెల్లింపులను నగదు రూపంలోనే చేశామని చెప్పారు. 18శాతం మంది 30శాతం50శాతం నగదు చెల్లింపులు జరపగా, 15శాతం మంది 010శాతం వరకూ నగదు రూపంలో చెల్లించామని తెలిపారు. వాహనాలు, ఎలక్టాన్రిక్‌ పరికరాల కొనుగోలుకు మినహా చాలా మంది తమ కుటుంబ అవసరాలకు నగదు చెల్లింపులే జరుపుతున్నారు. 26శాతం మంది భారతీయులు నిత్యావసరాల కొనుగోలుకు నగదు చెల్లింపుల పైనే ఆధారపడుతున్నారు. 11,189 మంది పౌరుల్లో కేవలం 15శాతం మంది మాత్రమే నగదు లావాదేవీలు జరపడం లేదు. గత సంవత్సర కాలంలో ఏడు శాతం మంది దీర్ఘకాలిక ఆస్తులతో పాటు బంగారం, వాహనాల కొనుగోలుకు నగదే చెల్లించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు