Thursday, May 16, 2024

సంగారెడ్డిలో బీఆర్‌ఎస్‌ విజయం ఖాయం

తప్పక చదవండి

సదాశివపేట : సంగారెడ్డి నియోజకవర్గంలో టిఆర్‌ఎస్‌ జండా ఎగరవేయడం ఖాయమని మంత్రి హరీష్‌ రావు తెలిపారు. సదాశివపేటలో మన బిన్‌ ఫౌండేషన్‌ అధినేత సుప్రీంకోర్టు న్యాయవాది ముఖీం మంత్రి హరీష్‌ రావు సమక్షంలో చింతా ప్రభాకర్‌ నాయకత్వంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ ప్రస్తుత ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో లేకుండా ఎన్నికల సమయంలో మాత్రమే హడావిడి చేస్తూ ప్రజలను మభ్యపెట్టి మాయ మాటలు చెప్పి తను గెలిచిన తర్వాత అందుబాటులో లేకుండా పోయారని కానీ ఎమ్మెల్యే పదవిలో లేకుండా చింతా ప్రభాకర్‌ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ అన్ని విధాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని ఈ సందర్భంగా చింతా ప్రభాకర్‌ నాయకత్వంలో మన బీన్‌ ఫౌండేషన్‌ అధినేత ముఖీం బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరడం హర్షించదగ్గ విషయం అని తెలియజేశారు. ముఖీం బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరడం నియోజకవర్గానికి మరింత బలం చేకూర్చిందని సంగారెడ్డి నియోజకవర్గంలో బిఆర్‌ఎస్‌ జండా ఎగరడం ఖాయమని సందర్భంగా తెలియజేశారు. ఈ సందర్భంగా మన పిన్‌ ఫౌండేషన్‌ అధినేత ముఖీంకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది, అలాగే పార్టీలో చేరిన వారు సదాశివపేట ఇండిపెండెంట్‌ కౌన్సిలర్‌ షరీఫ్‌ కొత్తగొల్ల సత్య యాదవ్‌ మునిపల్లి రమేష్‌ మాజీ కౌన్సిలర్‌ ఉస్మాన్‌ అంబేద్కర్‌ యువజన సంఘం అధ్యక్షుడు ప్రభు మన బీన్‌ ఫౌండేషన్‌ కార్యకర్తలు ఉన్నారు. ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ చింతా గోపాల్‌ పిల్లోడు విశ్వనాథం శీలా మల్లన్న సదాశివపేట పట్టణ వార్డు సభ్యులు కో ఆప్షన్‌ సభ్యులు కొండాపూర్‌ డిఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు