Friday, May 3, 2024

పలు స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్‌

తప్పక చదవండి
  • గుర్తించే పనిలో పడ్డ పోలీసులు

బెంగళూరు : బెంగళూరులో బెదరింపు మెయిల్స్‌ కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని మెయిల్‌ అడ్రస్‌ ల నుంచి బెంగళూరులోని 13 పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. విషయాన్ని స్కూళ్ల యాజమాన్యాలు పోలీసులకు చేరవేశారు. భయంతో పిల్లలను ఇళ్లకు పంపించారు. ఆయా బడులకు చేరుకున్న పోలీసులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా ఉన్న వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని పోలీసులు వివరించారు. మెయిల్‌ పంపిన వ్యక్తులను గుర్తించే పనిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. గతేడాది బెంగళూరులోని ఏడు పాఠశాలలకు ఇలాంటి బాంబు బెదిరింపులు కాల్స్‌ వచ్చినప్పటికీ అది బూటకమని తేలిందని పోలీసులు తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు