Wednesday, May 15, 2024

అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతా..

తప్పక చదవండి
  • కుట్రలతో మోసం చేసిన పార్టీలకు బుద్ధి చెప్పండి..
  • ఓట్లేసి ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఇవ్వండి..
  • మన ఓట్లు మనం వేసుకుందాం : నీలం మధు ముదిరాజ్

మన ఓట్లు మనమే వేసుకొని మన అభివృద్ధి మనమే చేసుకుందామని బీఎస్పి పటాన్ చెరు ఎమ్మెల్యే అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. అదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా అమీన్పూర్ మండలం పటేల్ గూడ గ్రామంలో స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బహుజన రాజ్యం తోనే బడుగులకు రాజ్యాధికారం వస్తుందన్నారు. మనం రాజకీయంగా ఎదిగితే తమ రాజకీయ భవిష్యత్తు అంధకారంలో పడుతుందని భయంతో కొందరు నాయకులు కుట్రలు చేసి మనల్ని అణచివేస్తున్నారని ఆరోపించారు. మనల్ని ఎదగకుండా కుట్రలు చేసిన బీఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని ప్రజలకు తెలియచెప్పారు. ఒక పేద ఇంటి బిడ్డగా తనకు అందరి సమస్యలు తెలుసని తనకు అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే పటేల్ గూడను అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలైన రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, పార్కుల నిర్మాణం,చేస్తానని స్పష్టం చేశారు.గ్రామంలో అవరోధంగా మరీనా పరిశ్రమల కాలుష్యాన్ని కంట్రోల్ చేస్తానని తెలిపారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే పటాన్ చెరు నియోజకవర్గ రూపురేఖలు మార్చుతానని, దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని భరోసా ఇచ్చారు. పేదరికం లేని పటాన్ చెరు కోసం మన భావితరాల భవిష్యత్తు కోసం నవంబర్ 30వ తారీఖున జరిగే ఎన్నికలలో బీ ఎస్పీ పార్టీ ని బల పరచి ఏనుగు గుర్తుపై ఓటు వేసి తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు, కాలనీ వాసులు, ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు