Sunday, May 19, 2024

ప్రజానాయకులు స్వర్గీయ ఎస్. పాండు రంగా రావు..

తప్పక చదవండి
  • వకుళాభరణం కృష్ణమోహన్ రావు..
  • పాండురంగారావు 22 వర్దండి కార్యక్రమం..

హైదరాబాద్ : పాతనగర ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసిన ప్రజా నాయకుడు స్వర్గీయ ఎస్.పాండురంగా రావు అని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు. ఎస్.పాండురంగ రావు 22వ వర్ధంతి సందర్భంగా మంగళవారం నాడు ఛాత్రినాక మిత్ర యువజన సంఘంలో ఆయన కుమారుడు, కమిటీ ప్రధాన కార్యదర్శి ఎస్.పి. క్రాంతి కుమార్ ఏర్పాటు చేసిన వర్ధంతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పాండురంగ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన పాతబస్తీ అభివ్రుది ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాండురంగా రావు చేసిన సేవలను కొనియాడారు.. అనంతరం పెద మహిళలకు చీరాల పంపిణీ, విద్యార్థులకు నోట్ పుస్తకాల కిట్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్.పి.క్రాంతి కుమార్ తో పాటు సంఘం సభ్యులు బి.కోటేష్, శేషాద్రి, ఎస్.పృధ్వీరాజ్, ఎస్.కరణ్ కుమార్, బి.కార్తిక్ చారి, బి.వెంకటేష్, వి.యజత్, అఖిల్, జీ.కార్తిక్ కుమార్ ఇతర సభ్యులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు