Tuesday, May 7, 2024

ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్‌ ప్లేయర్‌

తప్పక చదవండి

రికార్డు స్థాయిలో ఆరోసారి వన్డే ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా జట్టుపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో టీమ్‌ఇండియాను ఓడిరచి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 240 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా జట్టు 42 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఈ లక్ష్యాన్ని చేరుకుంది. కాగా ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై క్రికెట్‌ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్లందరూ ప్రపంచ కప్‌తో సరదాగా ఫొటోలు దిగారు. అయితే ఆ జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ మాత్రం వరల్డ్‌ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగుతూ ఫొటోలకు పోజులిచ్చాడు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రతిష్ఠాత్మక, గౌరవప్రదమైన ప్రపంచకప్‌ను ఇలా అవమానించడం తగదంటూ క్రికెట్‌ అభిమానులు ఆసీస్‌ ప్లేయర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అదే సమయంలో 2011లో టీమిండియా వరల్డ్‌ కప్‌ గెల్చిన నాటి ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంటున్నారు ఫ్యాన్స్‌. సచిన్‌, ధోనిలు ప్రపంచ కప్‌ను ముద్దాడుతున్న ఫొటోలను కంపేర్‌ చేస్తూ ఆసీస్‌ క్రికెటర్లను ట్రోల్స్‌ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా క్రికెటర్లు ఇలా అమర్యాదగా ప్రవర్తించడం ఇదేమి మొదటిసారి కాదు. 2006లో భారత్‌ వేదికగా జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీలోనూ ఇలాగే వ్యవహరించారు. అప్పుడు బీసీసీఐ ప్రెసిడెంట్‌ గా ఉన్న శరద్‌ పవార్‌..ఆస్ట్రేలియాకు విన్నింగ్‌ ట్రోఫీని అందించారు. అయితే అప్పటి కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ స్టేజ్‌ దిగిపోవాలని శరద్‌ పవార్‌ ను నెట్టిసిన ఘటనను మరోసారి గుర్తుచేసుకుంటున్నారు ఫ్యాన్స్‌.
………

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు