Wednesday, May 15, 2024

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల ..

తప్పక చదవండి

న్యూఢిల్లీ : దేశంలో తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం.. తెలంగాణలో నవంబర్‌ 3న పోలింగ్‌ జరగనుంది. నవంబర్‌ 3 నుంచి నామినేషన్‌ల ప్రక్రియ ప్రారంభం కానుంది. నవంబర్ 15 నామినేషన్‌ల ఉపసంహరణకు చివరితేది. నవంబర్‌ 30న పోలింగ్‌ జరుగుతుంది. డిసెంబర్‌ 3న కౌంటింగ్‌ నిర్వహించనున్నారు. మిజోరంలో నవంబర్‌ 7న పోలింగ్‌ జరుగుతుంది. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతా కారణాల రీత్యా ఛత్తీస్‌గఢ్‌లో రెండు విడతల్లో పోలింగ్‌ నిర్వహించనున్నారు. నవంబర్‌ 7న తొలి విడత పోలింగ్‌, నవంబర్‌ 17న రెండో విడత పోలింగ్‌ జరుగనుంది. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో కూడా తెలంగాణలో మాదిరిగా ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. మధ్యప్రదేశ్‌లో నవంబర్‌ 17న, రాజస్థాన్‌లో నవంబర్‌ 23న పోలింగ్‌ నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు