సిద్ధిపేట : సిద్ధిపేటలో స్వామి (54) అనే వ్యక్తి పోలింగ్ కేంద్రంలో ఓటు వేసి ఇంటికి తిరిగి వెళుతుండగా గుండెపోటుకు గురయ్యాడు. స్దానికులు స్వామిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించాడని ధ్రువీకరించారు. హైదరాబాద్లో ఉంటున్న స్వామి ఓటు వేసేందుకు సిద్ధిపేట వచ్చి మృత్యువాతన పడటంతో కుటుంబసభ్యులు, బంధుమిత్రులు విషాదంలో మునిగిపోయారు.