- ముగ్గురు ముఖ్యమంత్రులది విభిన్నదారి
- అమర్ దేవులపల్లి పుస్తకం ఆవిష్కరణ
- ‘ది డెక్కన్ పవర్ ప్లే’ పేరిట రాజకీయాల అక్షరరూపం
- ఆవిష్కరించిన ప్రధాని మాజీ సలహాదారు సంజయ్ బారు
న్యూఢిల్లీ : ప్రముఖ జర్నలిస్టు దేవులపల్లి అమర్ రచించిన ’ది డెక్కన్ పవర్ ప్లే ’ పుస్తకాన్ని మాజీ ప్రధాని మీడియా మాజీ సలహాదారు సంజయ్ బారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్ట్ వెంకట నారాయణ, ఆలిండియా కెమెరామన్ అసోసియేషన్ అధ్యక్షుడు సిన్హా, ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు లహరి తదితరులు హాజరయ్యారు. పుస్తక ఆవిష్కరణ సందర్భంగా అతిథులు పలు కీలక అంశాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా సంజయ్ బారు మాట్లాడుతూ ..జాతీయ రాజకీయాల్లో తెలుగు వారి ప్రాధాన్యం తగ్గుతోందన్నారు. విభజన వల్ల రాజకీయంగా కేంద్రంలో తెలుగు బలం తగ్గిందన్నారు. రాజకీయాలు భాష కాకుండా, కులం ఆధారంగా మారిపోతున్నాయన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాతా… రెండు రాష్ట్రాల్లో పారిశ్రామిక అభివృద్ధి కొనసాగడం శుభపరిణామం అన్నారు. పాలసీల కొనసాగింపు వల్ల మంచి అభివృద్ధి జరిగిందన్నారు. డెక్కన్ ప్రాంతం ఈ దేశానికి గ్రోత్ ఇంజన్ అన్నారు. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలు ఈ దేశ అభివృద్ధికి గ్రోత్ ఇంజన్లా పని చేస్తున్నాయని అన్నారు. 50 శాతం జనాభా హిందీ రాష్ట్రాల్లో ఉంటే, దక్షిణాది రాష్ట్రాలు 50శాతం జిడిపి దేశానికి అందిస్తున్నాయన్నారు. రచయిత దేవులపల్లి అమర్ మాట్లాడుతూ.. తెలుగు రాజకీయాలపై ఢల్లీిలో అపోహలు, పొరపాటు అభిప్రాయాలు ఉన్నాయన్నారు. ఢల్లీి మీడియా దక్షిణ రాజకీయాలను సరైన రీతిలో పట్టించుకోలేదన్నారు. ఢల్లీి మీడియా తప్పుడు అభిప్రాయాలను సరిచేసేందుకే ఈ పుస్తకం తీసుకొచ్చాం అని అన్నారు. అందుకే దక్షిణాది రాజకీయాల అంశాన్ని ఎంచుకుని పుస్తకం రాశానని అన్నారు. 47 ఏళ్ల జర్నలిస్ట్ జీవితంలో అనేక అనుభవాలను ఈ పుస్తకంలో ప్రస్తావించాని వెల్లడిరచారు. సీనియర్ జర్నలిస్ట్ వెంకట్ నారాయణ మాట్లాడుతూ దక్కన్ రాజకీయాలపై వచ్చిన మంచి పుస్తకం ఇదని అన్నారు. దక్షిణ భారతం నుంచి రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి అవుతారని భావిస్తున్నట్లు వెల్లడిరచారు. ఇకపోతే పుస్తకంలో దేవులపల్లి అమర్ పలు అంశాలు చర్చించారు. తెలుగు రాజకీయాల్లో ముగ్గురు నాయకులు బహుశా ఎప్పటికీ గుర్తుండిపోతారేమో. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, ప్రస్తుత ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అలాగే 14 ఏళ్ల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు ప్రజాసేవలో భిన్నమైన దారులు ఎంచుకుని, తెలుగునాట రాజకీయాలపై తమదైన ముద్ర వేసిన నేతలుగా చెప్పారు. ఈ ముగ్గురూ రాజకీయాల్లో ఎంచుకున్న దారుల గురించి, అనుసరించిన పద్ధతుల గురించీ విశ్లేషిస్తుందీ పుస్తకం. 40 ఏళ్ళపాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తమదైన ముద్ర వేసిన ఈ నాయకులను అతి దగ్గరగా చూసిన దేవులపల్లి అమర్, తన అనుభవాన్నంతా మేళవించి రాసిన ’మూడు దారులు’, నాయకుల రాజకీయ క్రీడలను, అధికారం కోసం వెన్నుపోట్లకు సైతం వెనుకాడని వారి తెగింపును కళ్ళకు కడుతుంది. ముఖ్యంగా చంద్రబాబు చేసిన ’వైస్రాయ్ కుట్ర’ పాఠకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీని రెండవ సారి చీల్చి కాంగ్రెస్ (ఐ) అనే కొత్త రాజకీయ పార్టీని 1978 లో ఇందిరాగాంధీ ఏర్పాటు చేయడం మొదలుకుని 2014లో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వరకూ అనేక పరిణామాలను, అందుకు కారణమైన నేతల వైఖరిని విపులంగా చర్చించింది ఈ పుస్తకం. గడచిన నలభయ్యేళ్లలో సంయుక్త ఆంధప్రదేశ్ ను పాలించిన మర్రి చెన్నారెడ్డి మొదలుకుని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వరకూ 11 మంది ముఖ్యమంత్రులతోపాటు ప్రస్తుత విభజిత ఆంధప్రదేశ్, తెలంగాణ రాష్టాల్రలో చోటు చేసుకున్న సంఘటనలపై రచన విశ్లేషణాత్మకంగా సాగింది. పుస్తకం చదువుతున్నంతసేపూ రాజకీయ వేదికపై ఉత్కంఠభరితమైన తెలుగు సినిమా చూస్తున్నట్టుగా ఉంటుంది.