- 20 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు
జడ్చర్ల : మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో పెను ప్రమాదం తప్పింది. విద్యార్థులను తీసుకెళ్తున్న పాఠశాల బస్సు బోల్తా పడింది. దీంతో 20 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మౌంట్ బాసిల్ స్కూల్కు చెందిన బస్సు జడ్చర్ల`మహబూబ్నగర్ మార్గంలో కొత్త తండా వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో బస్సులో విద్యార్థులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు.. స్థానికులతో సహాయకచర్యలు చేపట్టారు. విద్యార్థులను దవాఖానకు తరలించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తివివరాలు తెలియాల్సి ఉన్నది.