మణికొండ (ఆదాబ్ హైదరాబాద్): మణికొండ మున్సిపల్ లోని పుప్పాలగూడలో సాయి పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ లో ఘనంగా స్పోర్ట్స్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మునిసిపల్ బి ఆర్ ఎస్ మహిళ అధ్యక్షురాలు రూపా రెడ్డి, దళారి మూవీ డైరెక్టర్ గోపాల్ రెడ్డి, ఆస్కార్ అవార్డు గ్రహీత కబీర్ రఫీ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ సౌమ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.