మణికొండ (ఆదాబ్ హైదరాబాద్): మణికొండ మున్సిపల్ షేక్పేట్ బాక్సింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా ముఖ్య అతిథులుగా బివిఆర్ ఇన్ఫ్రా డెవెలపర్స్, నవ భారత ప్రసిడెంట్ బి.వినయ్, వనిత, ఇండియన్ రైల్వే బోర్డ్ మెంబర్ ఉమా రాణి, వైస్ వైస్ చైర్మన్ కె నరేందర్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ చదువుతో పాటు ఆటలు కూడా మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని తెలిపారు. గెలిచిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. విజేతలుగా నిలిచిన వారు డిసెంబర్ 20 నుంచి 27 వరకు ఉత్తర ప్రదేశ్ నోయిడాలో జాతీయ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో పాల్గొంటారన్నారు. ఈ కార్యక్ర మంలో మాజీ ఎంపీటీసీ రాఘవ రెడ్డి, తెలంగాణ బాక్సింగ్ అధ్యక్షుడు బాబురావు, తెలంగాణ ఒలంపిక్ ట్రెజరర్ మహేష్, తెలంగాణ బాక్సింగ్ సెక్రటరీ రవీందర్, బీడీ మన్మోహన్, ఎల్లయ్య, లక్ష్మణ్, వరల్డ్ ఛాంపియన్ నికత్ జరిన్ తండ్రి జమ్మీల్, బీజేపీ హైదరాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ ఇంద్రసేనా రెడ్డి, షైక్పేట్ బాక్సింగ్ క్లబ్ కోచ్ వినేష్ బాబు, శివకుమార్, సన్నీ, శశాంక్, లోకేష్, రఘువీర్, కోచ్ లు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.