- విడుదల చేసిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : రామ్లల్లా ప్రాణప్రతిష్ఠకు ముందుగా గురువారం శ్రీరామ జన్మభూమి ఆలయంపై స్మారక పోస్టల్ స్టాంప్ను ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేశారు. దీనితో పాటు రాముని చిత్రంతో కూడిన స్టాంపుల పుస్తకాన్ని కూడా ప్రధాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. ఈ 48 పేజీల పుస్తకంలో 20 దేశాల స్టాంపులు ఉన్నాయి. రామాలయ పోస్టల్ స్టాంపు విడుదల అనంతరం ప్రధాని మోడీ ఓ వీడియో సందేశాన్ని కూడా విడుదల చేశారు. ప్రధాని మోడీ మొత్తం 6 తపాలా స్టాంపులను విడుదల చేశారు. వీటిలో రామాలయం, గణెళిశుడు, హనుమంతుడు, జటాయువు, శబరి మొదలైనవి ఉన్నాయి. ఈ 48 పేజీల పుస్తకంలో అమెరికా, న్యూజిలాండ్, సింగపూర్, కెనడా, కంబోడియా, ఐక్యరాజ్యసమితి వంటి సంస్థలు సహా 20కి మించిన దేశాలు విడుదల చేసిన పోస్టల్ స్టాంపులు ఉన్నాయి.