Sunday, May 12, 2024

శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి 8 గంటల సమయం

తప్పక చదవండి

తిరుమల : తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తిరుమలలోని కంపార్ట్‌మెంట్లలో వేచియున్నారు. నిన్న స్వామివారిని 56,950 మంది భక్తులు దర్శించుకోగా 20,463 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.75 కోట్లు వచ్చిందని వివరించారు. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయంలో రుద్రహోమంశుక్రవారం నుంచి ప్రారంభమైంది. నెల రోజుల పాటు జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా 11వ తేదీ వరకు హోమం నిర్వహిస్తామని అర్చకులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం పూజ, రుద్రజపం, హోమం, లఘు పూర్ణాహుతి, నివేదన, హారతి తదితర కార్యక్రమాలను నిర్వహించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు