Saturday, May 11, 2024

250 యూనిట్ల ఉచిత పథకాన్ని ఖండిస్తున్నాను : బండి సంజయ్

తప్పక చదవండి
  • ముస్లిం ధోబి ఘాట్లకు, లాండ్రీ షాపులకు ఇచ్చే
    ఈ ఉచిత పథకం సమున్నతం కాదు..
  • ఇక గల్లీ గల్లీలో వేరే వర్గానికి చెందిన లాండ్రీ షాపులు వెలుస్తాయి..
  • మైనారిటీ వర్గం ఓట్ల కోసం బీసీల కుల వుత్తులపై దాడి జరుగుతోంది..
  • ఎం.ఐ.ఎం. ను సంతృప్తి పరచాలన్నదే కేసీఆర్ ధ్యేయం..

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో తరతరాలుగా దోభి వృత్తిపై ఆధారపడి బతుకుతున్న రజకులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారు. ఇక గల్లీ గల్లీలో వేరే వర్గానికి చెందిన వాళ్ళ లాండ్రీ షాపులు వెలుస్తాయి. ఓవైసీని సంతోష పెట్టడానికి రజకుల వృత్తిని నాశనం చేస్తారా? అని బండి సంజయ్ ప్రశ్నించారు.. ఈ నయా నిజాంకు మత పిచ్చి ఎక్కువైంది. ఒక మతం ఓట్ల కోసం కేసీఆర్ హిందూ సమాజంలో ఉన్న కులవృత్తులను అణిచివేస్తున్నారు. కేసీఆర్ ది మత దురహంకారం. బీసీల కుల వృత్తులను ఆర్థికంగా దెబ్బతీసి అయినా సరే ఎం.ఐ.ఎం.ను సంతృప్తి పరచాలన్నది కేసీఆర్ లక్ష్యం. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది మైనార్టీ వర్గం ఓట్ల కోసం కేసీఆర్ బీసీల కులవృత్తులపై దాడి చేస్తారా. ఇప్పటికే వేరే వాళ్లు దూరడంతో తమ కులవృత్తుల వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని బీసీ కులాల వాళ్ళు తీవ్ర మనో వేదనలో ఉన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మూలిగే నక్కపై తాటి పండు ఎత్తేసినట్టుగా ఉంది. కులవృత్తులపై ఆధారపడ్డ బీసీలు, ఎస్సీలు కేసీఆర్ చేస్తున్న ద్రోహన్ని గమనిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న రజకులకు బిజెపి అండగా ఉంటుంది. సమిష్టిగా కేసీఆర్ మత దురహంకారం పై పోరాడుదాం. కులవృత్తులను కాపాడుకుందాం అని పిలుపునిచ్చారు బండి సంజయ్..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు