Sunday, May 19, 2024

వికారాబాద్‌ రైల్వే స్టేషన్‌లో 12 కేజీల గంజాయి స్వాధీనం

తప్పక చదవండి
  • వివరాలు వెల్లడిరచిన జిల్లా ఎక్సైజ్‌ అధికారి నవీన్‌ చంద్ర

వికారాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో భాగంగా ఎక్సైజ్‌ అధికారులు నిర్వహించిన తనిఖీ లలో 12 కేజీల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగిందని జిల్లా ఎక్సైజ్‌ అధికారి నవీన్‌ చంద్ర బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వికారాబాద్‌ రైల్వే స్టేషన్లో సోదాలు జరుపగా గంజాయి ప్యాకెట్లు పట్టుబడ్డాయి కానీ గంజాయి సరఫరా చేసిన వ్యక్తులు పట్టుబడలేదని వివరించారు. జిల్లాలో అక్రమ మద్యం మాదక ద్రవ్యాలు సరఫరా చేసే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ తనిఖీ నిర్వహణలో ఎక్సైజ్‌ సబ్‌ ఇన్స్పెక్టర్‌ కోటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు. అయితే పట్టుబడిన గంజాయిని తరలించిన నిందితులు పట్టు పడకుండా తప్పించుకోవడం గమనార్హం.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు