- ‘కోట్ల విలువైన ప్రభుత్వ భూములు కబ్జా’ శీర్షికన కథనం ప్రచురణ..
- 21 మే 2023 ఆదాబ్ కథనంపై చర్యలు..
- ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన రూముల కూల్చివేత..
హైదరాబాద్ : రాజేంద్ర నగర్ పరిధిలోని సర్వే నెంబర్ 156/1లో 3వేల గజాల ప్రభుత్వ భూమి కబ్జాకు తీవ్ర యత్నం జరిగింది.. దీని వెనకాల స్థానిక ఎమ్మెల్యే హస్తం ఉందంటూ విమర్శలు వెలు ్లవెత్తాయి.. ఈ ఘటనను ఉటంకిస్తూ ఆదాబ్లో ప్రచురి తమైన కథనానికి స్పందిం చిన సంబంధిత అధికారులు సోమవారం రోజు, ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన రూములను జేసీబీలతో తొలగించడం జరిగింది.. కేవలం కూల్చి వేతలతోనే సరిపెడతారా..? లేక ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటారా..? అన్నది వేచి చూడాలి.. ఆదాబ్ చూపిన చొరవకు స్థానికుల నుండి అభినందనలు వెల్లువెత్తాయి..