కరీంనగర్ (ఆదాబ్ హైదరాబాద్): అయ్యప్ప మహాపడి పూజ మహోత్సవం మహోన్నత మైనదని, మహిమానిత్వ మైనదని తద్వారా సకల పాపాలనుండి విముక్తులమౌతామని, మానవజన్మను పునీతంచేస్తామని అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డా.వి. నరేందర్ రెడ్డి స్థానిక వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ మేన్క్యాం పస్ ప్రాంగణంలో శ్రీశ్రీశ్రీ చక్రవర్తుల పురుషోతమాచార్యులు గురుస్వామి (గూడెం స్వామి) మార్గదర్శకమున శాస్త్రోంగా వేద మంత్రాల మధ్య పదునెట్టంబడి పూజను సాంప్రదాయంగా జ్యోతి ప్రజ్వలనతో శ్రీ మహా గణపతికి పూజను నిర్వహించి దేదిప్యమానంగా ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయ్యప్ప మహాపడి పూజ చేయడం పూర్వ జన్మ సుక్రుతమని, ఎన్నో ఆటంకాలను తొలగించి సర్వశుభాలను పొందడానికై మార్గాన్ని సుగమం చేస్తుందని తెలుపుతూ మహాదేవుని పుత్రుడైన హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడు పుష్కలంగా పొందడానికై వారి కార్యాలను అత్యంతభక్తిశ్రద్ధలతో ఆచరించి జీవనాన్ని ఆటంకం లేకుండా కొనసాగించడానికై దోహద పడుతుందని చెప్పారు. అంతటి మహిమ గల స్వామి ఆశీస్సులను విశేషంగా సమాజాభి వృద్ధికై విశ్వ శ్రేయస్సుకై పలు కార్యక్రమాలను ఆధ్యాత్మిక చింతనతో చేపడుతూ ముందుకు కొనసాగుతున్నామని చెప్పారు. విశేషంగా విద్యార్థుల యొక్క విద్యాభివృద్ధి ప్రత్యక్షంగా వివిధ ఫలితాల రూపంలో కనబడుతుందని చెప్పారు. మహాపడి పూజలో బాగంగా శ్రీశ్రీశ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి వారికి విశేషంగా వివిధ రకాల పుష్పాలతో, సుగంధ ద్రవ్యాలతో, విశేషంగా ఫల పంచామృతాలతో, పండ్లరసాలతో స్వామియే శరణం అయ్యప్ప శరణుఘోష మధ్య వైభోపేతంగా నిర్వహింపబడిన పూజా కార్యక్రమంలో గురుస్వామి వారి ఆశీస్సులు అందరికి అందజేయం జరిగిందని చెప్పారు. శ్రీశ్రీశ్రీ చక్రవర్తుల పురుషోతమాచార్యులు గురుస్వామి (గూడెం స్వామి) గారు మాట్లాడుతూ అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఆద్యాత్మిక కార్యక్రమాలకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తు విద్యార్థుల్లో విద్యతో పాటు ఆధ్యాత్మికతను పెంపొదిస్తున్నారని తెలిపారు అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడం ద్వారా తప్పనిసరిగ్గా విశేష ఫలితాలు పొందగల్గుతామని తెలుపుతూ శభరిమల్లో నిర్వహించబడే పూజా విధానాన్ని ఈ ప్రాంగణంలో కూడా అవలంభించి పదునెటంబడి పూజను విశేషంగా విద్యుత్కాంతుల నడుమ భక్తుల కోలాహాలం నడుమ స్వామి వారి శరణుఘోశ మధ్య నిర్వహిండం చాలా శ్రేయస్సుకరమైనదని తెలుపుతూ కరీంనగర్ భక్త భృందానికి స్వామి వారి ఆశీసులు ఎల్లపుడు విశేషంగా ఉండాలని ఆశ్వీరదించారు నరేందర్రెడ్డి భవిష్యత్లో మరిన్ని పూజలను విశేషంగా నిర్వహింపబడి ఆధ్యాత్మిక చింతనకు మారుపేరుగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సుమారు 400 వందల మంది అయ్యప్ప దీక్షా పరులు మరియు పాఠశాలల, కళాశాలల సిబ్బంది మరియు వారి కుటుంభ సభ్యులు పాల్గొన్నారు.