- చంద్రబాబుకు షాక్ ఇచ్చిన ఏపీ హైకోర్టు..
స్కిల్డెవలప్మెంట్ స్కామ్లో అరెస్టయి రాజమండ్రి జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబాకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ముఖ్యమంత్రి దాఖలు చేసిన మూడు ముందస్తు బెయిల్ పిటిషన్లను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఫైబర్నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు కేసుల్లో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై తీర్పు వెలువరించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విజయవాడలోని ఏసీబీ కోర్టు తీర్పును మధ్యాహ్నం వెలువరించనుంది. ఇటీవల విచారణ చేపట్టిన కోర్టు తీర్పును నేటికి వాయిదా వేసినవిషయం తెలిసిందే. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీపై న్యాయస్థానం తీర్పునివ్వనుంది. దీంతోపాటు రెండు పీటీ వారెంట్లపై కూడా విచారణ జరిపే అవకాశం ఉన్నది.