Friday, May 17, 2024

ప్రాణాలు పోతేనే స్పందిస్తారా?

తప్పక చదవండి

పర్వతగిరి : పర్వతగిరి మండలం సోమారం గ్రామ పరిధిలోని డబుల్‌ బెడ్‌ రూమ్‌ గృహాల నుండి కొంకపాక రెవెన్యూ శివారులోని ఎస్‌.ఆర్‌.ఎస్‌.పి. కెనాల్‌ వరకు ఆర్‌అండ్‌బి రోడ్డకు ఇరువైపులా, అలాగే మూల మలుపుల వద్ద ఉన్న పిచ్చి మొక్కల వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, వెంటనే తొలగించాలని పలురకాల వాహనదారులు డిమాండ్‌ చేస్తున్నారు. నిత్యం ప్రజాప్రతినిధులు, అధికారులు వచ్చిపోయే సమయంలో పిచ్చి మొక్కలు కనిపించడం లేదా అని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. ప్రధాన రహదారి నుండి వెల్లాలంటే ప్రక్క నుండి ఏమి వస్తాయో తెలియని పరిస్థితులు నెలకొన్నాయని, ప్రాణాలు పోతే స్పందిస్తారా అని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాగు ప్రజా ప్రతినిధులు ఎన్నికల హడావుడిలో ఉన్నారని, ఇలాంటి పరిస్థితుల్లో సంబంధిత అధికారులు శ్రద్ధ తీసుకొని, రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాల ని వాహనదారులు కోరుతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు