Thursday, May 16, 2024

అవ్వ బాగున్నావా.. పెన్షన్ వస్తుందా

తప్పక చదవండి
  • ప్రచారంలో దూకుడు పెంచిన లక్ష్మన్న

మహబూబ్ నగర్ : జడ్చర్ల నియోజకవర్గం లోని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి వారి మంచి చెడులను తెలుసుకొని కుటుంబాల ఆర్థిక పరిస్థితులను గమనిస్తూ ప్రచారం నిర్వహించారు. గురువారం పట్టణంలోని నిమ్మబాయి గడ్డలో ప్రచారం చెప్పట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. ముఖ్యంగా ఇళ్లల్లో ఉంటున్న వృద్ధులకు కేసీఆర్ పెద్ద కొడుకుల పెన్షన్ ఇచ్చి ఆదుకుంటున్నారని అన్నారు. మూడోసారి కెసిఆర్ ముఖ్యమంత్రి అయితే మరిన్ని సంక్షేమ పథకాల అమలు చేస్తూ ప్రజలకు సేవ చేయలని అనుకుంటున్నారు. గత పది సంవత్సరాలలో జడ్చర్ల నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని, మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలు, రిజర్వాయర్ లను అధికారంలోకి రాగానే పూర్తి చేసి రైతులకు నీరు తాగునీరు అందించడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు