Monday, April 29, 2024

వెబ్‌ వెర్క్స్‌ పెట్టుబడి రూ. 5,200 కోట్లు

తప్పక చదవండి
  • తెలంగాణలో గ్రీన్‌ ఫీల్డ్‌ డేటాసెంటర్‌
  • సీఎం సమక్షంలో ఎంఓయూ ఖరారు
  • ఆదానీ గ్రూప్‌తో కూడా భారీ పెట్టుబడులు
  • రాష్ట్రంలో రూ.12,400 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్స్‌
  • సీఎం రేవంత్‌ రెడ్డి సమక్షంలో సంతకాలు
  • ఆరాజెన్‌లైఫ్‌ సైన్సెస్‌తో తాజా ఒప్పందం
  • 2వేల కోట్ల పెట్టుబడులకు కంపెనీ అంగీకారం
  • 1500మందికి కొత్తగా ఉద్యోగావకాశాలు
  • దావోస్‌ వేదికగా తెలంగాణకు పెట్టుబడులు

హైదరాబాద్‌ : తెలంగాణలో డేటా సెంటర్లను నెలకొల్పేందుకు వెబ్‌ వెర్క్స్‌ రూ.5200 కోట్ల పెట్టుబడులకు సిద్ధపడిరది. డేటా సెంటర్ల నిర్వహణలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఐరన్‌ మౌంటెన్‌ అనుబంధ సంస్థ వెబ్‌ వెర్క్స్‌. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి ఐరన్‌ మౌంటేన్‌ సీఈవో విలియం మీనీ, వెబ్‌ వెర్క్స్‌ సీఈవో నిఖిల్‌ రాఠీతో సమావేశమయ్యారు. తెలంగాణలో డేటా సెంటర్ల ఏర్పాటు, నిర్వహణపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రూ.5200 పెట్టుబడులకు వెబ్‌ వెర్క్స్‌ కంపెనీ తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్‌లో 10 మెగావాట్ల నెట్‌ వర్కింగ్‌`హెవీ డేటా సెంటర్‌లో ఇప్పటికే ఈ కంపెనీ రూ.1,200 కోట్లు పెట్టుబడి పెడుతోంది. దీనికి అదనంగా 4,000 కోట్లకు పైగా పెట్టుబడులతో రాబోయే కొన్ని సంవత్సరాలలో గ్రీన్‌ ఫీల్డ్‌ హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌ విస్తరించేందుకు ఈ ఒప్పందం చేసుకుంది. తెలంగాణలో డేటా సెంటర్ల ఏర్పాటును ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్వాగతించారు. డేటా సెంటర్ల ద్వారా ఐటీ రంగం అత్యున్నతంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. దేశంలోనే డేటా సెంటర్ల ఏర్పాటుకు తెలంగాణ అసలైన గమ్యస్థానంగా నిలుస్తుందని అన్నారు. పెట్టుబడిదారులు అందుకు అవసరమైన విద్యుత్తును కూడా పునరుత్పాదక వనరుల ద్వారా సమకూర్చుకుంటున్నారని అన్నారు. ఇదంతా తమ కొత్త ప్రభుత్వం అనుసరించే వ్యాపార అనుకూల విధానాలు, తాము ఎంచుకున్న ఫ్రెండ్లీ పాలసీపై వాళ్లకున్న నమ్మకాన్ని చాటి చెపుతోందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేయటం, దేశంలో తమ డేటా సెంటర్‌ కార్యకలాపాలను విస్తరించడంపై ఐరన్‌ మౌంటైన్‌ ఆనందం వ్యక్తం చేసింది. ’తెలంగాణ రాష్ట్రాని స్పష్టమైన ప్రాధాన్యతలున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మా డేటా సెంటర్‌లలో 100 పునరుత్పాదక శక్తిని ఉపయోగిస్తున్నాము. దీనిని భారతదేశంలో విస్తరించాలని చూస్తున్నాం. కొత్త కాంగ్రెస్‌ ప్రభుత్వం డేటా సెంటర్లు మరియు పునరుత్పాదక ఇంధనం రెండిరటికి మద్దతు అందించటం ద్వారా పెట్టుబడులను ఆకర్షణీయంగా మార్చిందని విలియం మీనీ అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు