- రెడ్డి కాలనీలో వెలసిన బ్యానర్
- 10 సంవత్సరాలు అయినా తీరని సమస్య..
కాప్రా : గత దశాబ్ద కాలంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నా కాప్రా సర్కిల్ చర్లపల్లి డివిజన్ చక్రిపురం రెడ్డి వాసులు తమ సమస్యను పరిష్కరించిన వారికే మద్దతిస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు కాలనీ ప్రధాన గేటు వద్ద బ్యానర్ ఏర్పాటు చేశారు. తమ కాలనీలో డ్రైనేజీ నిర్మాణానికి ఇప్పటికీ మూడు సార్లు శంకుస్థాపన చేశారు. కానీ ఎక్కడున్నా పని అక్కడే ఉందన్నారు. ఇప్పటికీ ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు కార్పోరేటర్లు మారారని ఆవేదన వ్యక్తం చేశారు. మా సమస్య ఇంత వరకు ఎవరూ పరిష్కరించలేదన్నారు.ఇప్పుడు ఎవరైతే మా సమస్య పరిష్కరిస్తారో వారికే మద్దతిస్తామని ప్రకటించిన రెడ్డి కాలనీవాసులు. ఈ విషయంలో ప్రజా ప్రతినిధులు దయచేసి తప్పుగా భావించవద్దని,ఎందుకంటే మాకు మా సమస్యకు పరిష్కారం ముఖ్యమన్నారు. ఇదిలా ఉండగా ఇదే బాటలో సమస్యలు పరిష్కారం కానీ పలు కాలనీలో బ్యానర్లు వెలిచే అవకాశం ఉందని తెలిసింది.