Sunday, May 19, 2024

కాంగ్రెస్‌ పార్టీ అలసత్వమే కారణం

తప్పక చదవండి
  • తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన యువకులు
  • గ్యారంటీ గాంధీలు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పినా వారి పాపాలకు ప్రాయశ్చిత్తం ఉండదు : ఎంఎల్‌సి కవిత

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో ఏళ్లు పోరాడిన సరైన సమయంలో స్పందించకపోవటంతో అనేక మంది యువకులు ప్రాణాలు తీసుకున్నారని వారి ప్రాణాలు పోవటానికి కాంగ్రెస్‌ పార్టీ అలసత్వమే కారణమని ఎంఎల్‌సి కవిత ఆరోపించారు. సోనియా, రాహుల్‌ గాంధీలు అమవీరుల స్థూపం ముందు మోకరిల్లినా వారి పాపాలకు ప్రాయశ్చిత్తం ఉండదని కవిత అన్నారు. పదేండ్లలో ఒక్కసారి కూడా గాంధీ కుటుంబానికి వందలాది తల్లుల కడుపు కోత గుర్తురాకపోవడం బాధాకరమన్నారు.ఆరు దశాబ్దాల పాటు తెలంగాణను మోసం చేసిన గాంధీలు కనీసం స్వయంగా క్షమాపణ చెప్పలేరా అంటూ నిలదీశారు. గ్యారంటీలకు గాంధీలు, క్షమాపణలకు బంట్రోతులా అంటూ సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ఆక్షేపించారు.‘గ్యారంటీలకు గాంధీలు, క్షమాపణలకు బంట్రోతులా! ఆరు దశాబ్దాల పాటు తెలంగాణను మోసం చేసిన గాంధీలు కనీసం స్వయంగా క్షమాపణ చెప్పలేరా? పదేండ్లలో ఒక్కసారి కూడా విూ కుటుంబానికి వందలాది తల్లుల కడుపు కోత గుర్తు రాకపోవడం బాధాకరం!. ఈ గడ్డవిూద జోడోయాత్రలు చేసి ఒక్కసారి కూడా జై తెలంగాణ చెప్పకపోవడం దారుణం. ఈ రోజుకీ విూకు అమరవీరుల స్థూపానికి దారి తెలియకపోవడం అత్యంత బాధాకరం. సోనియా, రాహుల్‌ గాంధీలు అమరవీరుల స్థూపం ముందు మోకరిల్లినా విూ పాపాలకు ప్రాయశ్చిత్తం ఉండదు!’ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు