Saturday, May 18, 2024

ముగిసిన రాష్ట్రపతి శీతాకాల విడిది

తప్పక చదవండి
  • ఘనంగా వీడ్కోలు పలికిన గవర్నర్‌, సిఎం

హైదరాబాద్‌ : తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన ముగిసింది. శీతాకాల విడిది నిమిత్తం ఈ నెల 18న హైదరాబాద్‌ వచ్చిన రాష్ట్రపతి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భూదాన్‌ పోచంపల్లిని సందర్శించారు. గత రాత్రి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్‌హోం కార్యక్రమం నిర్వహించారు. శనివారం ఉదయం హకీంపేట్‌లో రాష్ట్రపతికి గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌, సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు శ్రీధర్‌ బాబు, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, సీతక్క, అధికారులు వీడ్కోలు పలికారు. అనంతరం ప్రత్యేక విమానంలో ఆమె ఢిల్లీ బయల్దేరారు. ఆమె రాకతో బొల్లారం పరిసరాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు