Tuesday, May 21, 2024

అవకాశం వచ్చింది.. ఏకమవుదాం..

తప్పక చదవండి
  • నియోజకవర్గ రాజకీయ ముఖచిత్రం మార్చుదాం..
  • బీసీలపై అన్ని పార్టీలది చిన్న చూపే..
  • 70 ఏండ్లలో ఏ ఒక్క బీసీని ఎదుగనియ్యలేదు..
  • ప్రజలు మార్పు కోరుకుంటున్నరు..
  • నల్లగొండ ఒక్కరిద్దరి జాగీర్ కాదు.. మీ ఆటలు సాగవు
  • మీ కుట్రలను తిప్పి కొడదాం.. అసెంబ్లీ లోకి అడుగుపెడదాం..
  • పిలుపునిచ్చిన బీ.ఆర్.ఎస్. అసమ్మతి నేత పిల్లి రామరాజు యాదవ్..

హైదరాబాద్ : సందర్భం వచ్చింది, సమయం సమీపిస్తున్నది సకల జనులం, సబ్బండ వర్గాలం ఏకమవుదామని నల్లగొండ నియోజకవర్గ రాజకీయ ముఖచిత్రం మార్చుదామని బా.రా.స. అసమ్మతి నేత పిల్లి రామరాజు యాదవ్ నల్లగొండ మండల ముఖ్య కార్యకర్తలకు దిశా నిర్థేశం చేసాడు.

శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన నల్లగొండ మండల ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. నల్లగొండ నియోజకవర్గాన్ని ఆధిపత్యవర్గాలు 70 ఏండ్లు ఏలినా ఏ దళిత, బహుజన వర్గాలను, అగ్రకుల పేదలను, ఎమ్మెల్యేలుగా ఎదుగనీయలేదన్నారు. నామినేటెడ్ పదవులలో కూడా అవకాశాలు దక్కనియ్యలేదన్నారు. నల్లగొండ నియోజక వర్గం ఏ ఒక్కరు, ఇద్దరు వ్యక్తులదో లేదా, ఒక్కటి రెండు కులాల సొత్తో కాదన్నారు.

- Advertisement -

మన వాటా మనకు దక్కడానికి పోరాడుదామన్నారు. మేము బీఫాం అడుగడంలో ధర్మం, న్యాయం ఉందన్నారు. బీసీల దగ్గర డబ్బులు లేవని రాజకీయాలు తెలువువని హేళన చేస్తున్నారు. అలాంటి వారికి ఓటుతో తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. వందల కోట్లతో బయలుదేరడానికి దొంగలు సిద్దమైనారన్నారు.. వారు డబ్బుల సంచులు చూసి మోసపోవొద్దు అన్నారు. వారి కుట్రలను, కుతంత్రాలను, మాయమాటలను పసిగట్టాలన్నారు.. సమయం రాగానే వారి పనిబట్టాలని అన్నారు.

ఉన్న ఎమ్మెల్యే నల్లగొండ ప్రజలకు దూరమైతే ప్రతిపక్షంలో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఐదేండ్లు నల్లగొండ నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా పోయి, ఇవాళ మళ్ళీ కుర్చీ కావాలని ఆరాటపడుతున్నాడని, ఇలాంటి వారికి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.. దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మీ వస్తయని ఓట్ల కోసం ఆశపెడుతున్నారని.. ఈ ఎన్నికలలో అన్ని బంధేనని వారు అన్నారు. మనం ఎమ్మెల్యే అయిన తర్వాత అందరిని ఆదరిద్దాం అన్నారు.. అందుకు ప్రతిఒక్కరు కంకణబద్దులు కావాలన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు