Saturday, May 4, 2024

ముగిసిన హాలీవుడ్‌ కార్మికుల సమ్మె

తప్పక చదవండి

లాస్‌ఏంజెల్స : వేతనాలను పెంచాలని, కృత్రిమ మేధ (ఎఐ)కి వ్యతిరేకంగా హాలీవుడ్‌ నటీ నటులు నాలుగు మాసాలుగా సాగిస్తున్న చారిత్రాత్మక సమ్మె విజయవంతమైంది. అ లయెన్స్‌ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ అండ్‌ టివి ప్రొడ్యూసర్స్‌ (ఎఎంపిటిపి)కి, స్క్రీన్‌ యాక్టర్స్‌ గిల్డ్‌ అ మెరికన్‌ ఫెడరేషన్‌ ఆప్‌ టివి అండ్‌ రేడియో ఆర్టిస్ట్సు (ఎస్‌ఎజిఎఎఫ్‌టిఆర్‌ఎ) మధ్య ఒప్పందం కు దరడంతో హాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ ఊపిరిపీల్చుకుంది. మరి కొద్ది రోజుల్లో తిరిగి తన కార్యకలాపాల ను ప్రారంభించనుంది. నటీ నటుల సంఘం ఎస్‌ఎజిఎఎఫ్‌టిఆర్‌ఎ ప్రపంచవ్యాపితంగా 1,60,000 మంది వృత్తి నిపుణులకు ప్రాతినిధ్యం వహిస్తుండగా, లాస్‌ ఏంజెల్స్‌ కేంద్రంగా ఏర్పడిన ఎఎంపిటిపి 350 మంది అమెరికన్‌ టెలివిజన్‌ అండ్‌ ఫిల్మ్‌ ప్రొడక్షన్‌ కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తోంది.
ఇంచుమించు ఇవే డిమాండ్లపై హాలీవుడ్‌ రచయితలు నెల రోజుల పాటు నిర్వహించిన సమ్మె సెప్టెంబరు చివరి వారంలో ముగిసింది. 2023 జులై 14న ఈ సమ్మె మొదలైంది. నెలల తరబడి చర్చలు, రాజీలు, ఆఫర్లు, తిరస్కారాలతో అనేక మలుపులు తిరిగి చివరికి ఇరు పక్షాల మధ్య తాత్కాలికంగా ఒక ఒప్పందం కుదిరింది. స్టూడియోలతో కుదిరిన ఒప్పందం అసాధారణమైనదని, వంద కోట్ల డాలర్ల విలువైనదని ఎస్‌ఎజి`ఎఎఫ్‌టిఆర్‌ఎ ఒక ప్రకటనలో తెలిపింది. నటీ నట్టులకు మెరుగైన వేతనాలు చెల్లించేందుకు, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీని విచ్చల విడిగా వాడకుండా తగు చర్యలు తీసుకునేందుకు, ఆర్టిస్టులకు కొన్ని రక్షణలు కల్పించేందుకు ఫిలిం ప్రొడక్షన్‌ కంపెనీలు అంగీకరించాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు