Saturday, April 27, 2024

బాబు అరెస్ట్‌తోనే వైసిపి పతనం ప్రారంభం

తప్పక చదవండి
  • ఎన్నికల్లో జగన్‌కు బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్దం
  • టిడిపి అధికార ప్రతినిధి పట్టాభి

నెల్లూరు : చంద్రబాబు అరెస్టుతోనే రాష్ట్రంలో వైసిపి పతనం ప్రారంభమైందని పార్టీ సీనియర్‌ నేత మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి అన్నారు. టిడిపి, జనసేనలను ఎలా అరెస్ట్‌ చేయాలన్న ఆలోచన తప్ప రాష్ట్ర అభివృద్దిని జగన్‌ విస్మరించారని మండిపడ్డారు. మరోసారి జగన్‌రెడ్డిని గెలిపిస్తే సామాన్య, పేద ప్రజల బతుకులు పూర్తిగా అధోగతిపాలు అవుతాయని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన విధానాన్ని, వరుసగా టిడిపి నేతలపై కేసులను ప్రజలలోకి తీసుకువెళ్లాలని టిడిపి శ్రేణులకు సూచించారు. 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ రంగంలో ఎలాంటి అవినీతి, మచ్చలేని చంద్రబాబును అక్రమంగా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఇరికించి జైలుకు పంపడం దుర్మార్గమన్నారు. పైపెచ్చు చంద్రబాబు అరెస్టు అయిన విషయం జగన్‌రెడ్డికి తెలియదని బుకాయించడం ఆయన నిస్సిగ్గు రాజకీయానికి పరాకాష్ట అని అన్నారు. కొరివితో తల గోక్కున్నట్లుగా చంద్రబాబుతో పెట్టుకున్న జగన్‌రెడ్డిని గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైసిపి గల్లంతే అన్నారు. ఓటమి బయంతోనే పలు మార్పులకు దిగుతున్నారని అన్నారు. జగన్‌రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుంచి అభివృద్ధిని గాలికొదిలేసి అరాచకరం, రౌడీయిజం, గుండాయిజం పాలనతో రాష్టాన్న్రి అప్పుల ఊబిలోకి నెట్టేశారన్నారు. అంతటితో ఆగకుండా పేదల ఆస్తులు, స్థలాలను సైతం వదలకుండా అక్రమించుకోవడమే వైసిపి నాయకులు పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. వీరి దురాగతాలకు పోలీసులు, అధికారులు కూడా తానా అంటే తందానా అంటూ భజన చేయడం దారుణమన్నారు. సామాన్య, పేద ప్రజలకు అండదండా తెలుగుదేశం పార్టీ అనే సంగతి ప్రజలు గుర్తెరగాలన్నారు. దుర్మార్గపు వైసీపీ పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరెస్టును వ్యతిరేకిస్తూ నిర్వహిస్తున్న నిరసన దీక్షలకు అనూహ్య స్పందన వస్తోందని అన్నారు. చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేసి ఆనందం పొందుతున్న సైకో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కుట్రపూరిత పాలనను ప్రజలు అర్థం చేసుకుని వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పేందుకు ఎదురు చూస్తున్నారన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు