Sunday, May 19, 2024

కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలతో అధికార పార్టీలో గుబులు..

తప్పక చదవండి

జనగామ : జనగామ మండలం వడ్లకొండ గ్రామంలో, గానుగు పహాడ్ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలను గడప గడపకు తిరుగుతూ ప్రజలకు కర్రపత్రాల ద్వారా అందిస్తూ ప్రచారం చేశారు జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి.. వడ్లకొండ గ్రామంలో గౌరగల్లా యశోద తన కష్టాలు చెప్పుకోవడంతో, వెంటేనే స్పందించి ఆమెకు ఆర్ధిక సహాయం అందించారు.. అలాగే ఇటీవల కసర్ల యాదగిరి మరణించగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి ఆర్ధిక సహాయం చేశారు.. కొన్నేపాక శ్రీనివాస్ ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం చేసి వారి పిల్లలకు అయ్యే చదువు ఖర్చులు కూడా భరిస్తానని తెలిపారు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి.. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇద్దాం. తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తాము అని తెలిపారు
1…మహాలక్ష్మి మహిళలకు ప్రతి నెలా రూ. 2500.. • రూ. 500కే గ్యాస్ సిలిండర్.. • ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం.. 2. రైతు భరోసా.. రైతులకు ప్రతి ఏటా రూ.15000,, వ్యవసాయ కూలీలకు రూ. 12000.. వరి పంటకు బోనస్ రూ. 500.. 3. గృహజ్యోతి.. ప్రతి కుటుంబానికి 200యూనిట్ల ఉచిత విద్యుత్.. 4. ఇందిరమ్మ ఇండ్లు. ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, 5 లక్షలు.. ఉద్యమ కారులకు 250గ.జా ఇంటి స్థలం.. 5. యువ వికాసం.. విద్యార్థులకు ₹5 లక్షల విద్యా భరోసా కార్డు.. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్.. 6. చేయూత.. రూ.4000నెలావారి పింఛన్.. రూ. 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ భీమా పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు..ఈ కార్యక్రమంలో జనగామ మండల నాయకులు లింగాల నర్సిరెడ్డి, సర్వల నర్సింగరావు ,వడ్లకొండ గ్రామ అధ్యక్షులు దండబోయిన ధర్మేంద్రర్, వడ్లకొండ గ్రామ ఉప సర్పంచ్ గాజే అనిల్, గానుగుపహాడ్ గ్రామ ఉప సర్పంచ్ రవీందర్, సేవాదళ్ రాష్ట్ర కోఆర్డినేటర్ సుంకరి శ్రీనివాస్ రెడ్డి, జనగామ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బనుక శివరాజ్ యాదవ్, యశ్వంతపూర్ గ్రామ ఎంపిటిసి బాలరాజు గౌడ్, చిర్ర సత్యనారాయణ రెడ్డి,శామీర్ పేట మాజీ ఎంపీటీసీ మహేందర్,
జనగామ మున్సిపల్ మాజీ చైర్మన్ వేమళ్ళ సత్యనారాయణ రెడ్డి, జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లెల్ల సిద్దారెడ్డి, ఉడత రవి యాదవ్, గంగం నర్సింహరెడ్డి, ఎర్రగోల్లపహాడ్ మాజీ సర్పంచ్ చంద్రం, మోటే శ్రీనివాస్, ఆలేటి సిద్దిరాములు, బోట్ల నర్సింగరావు, దాసరి శేఖర్, పిట్టల సతీష్ ఆకుల లక్ష్మయ్య, పారుపల్లి ప్రభాకర్ రెడ్డి, వడ్లకొండ గ్రామ వార్డు మెంబర్లు నామాల వెంకటేష్, గోరిగే, ముగెందర్, చేనోజు నగేష్, రెడ్డబోయిన శ్రీనివాస్, గోనె శ్రీను, కన్నెబోయిన గూడెం మాజీ సర్పంచ్ లక్ష్మి, దాసరి క్రాంతి, బిర్రు సత్యనారాయణ, కర్రె ఉదయ్, సుదాకని కృష్ణ, పడిగా రాజు, బైరాన్ పల్లి ఉప సర్పంచ్ భద్రప్ప, యూత్ కాంగ్రెస్ నాయకులు గందమల్ల కమలాకర్, ఎనగందుల వెంకటేష్, యూత్ కాంగ్రెస్ జనగామ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ప్రకాష్ కొమ్మూరి, యువసేన జనగామ మండల అధ్యక్షులు బక్క ప్రవర్దన్, కొమ్మూరి యువసేన జనగామ మండల వైస్ ప్రెసిడెంట్ గాజుల రాజు యాదవ్, అరవింద్ గౌడ్ గానుగు పహాడ్ గ్రామ నాయకులు తాటి లక్ష్మీనారాయణ, రెడ్డబోయిన శంకరయ్య, బాబు సంతోష్, సరసనగల్లా మురళి, దడిగే సంపత్, ఎదునురి సిద్ధులు, గుర్రం శివాజీ, కడకంచి కరుణాకర్, రెడ్డబోయిన కొమురయ్య, శివరాత్రి రామచంద్రం, పల్లపు ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు