Sunday, May 19, 2024

బీజేపీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం

తప్పక చదవండి
  • రాబోయేది బీజేపీ ప్రభుత్వం
  • మేడ్చల్ బీజేపీ అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డి

మేడ్చల్ : మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మల్లారెడ్డి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వజ్రేష్ యాదవ్ ఇద్దరూ కబ్జా కోరులేనని మేడ్చల్ బీజేపీ అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డి విమర్శించారు. బుధవారం మేడ్చల్ పట్టణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కార్యకర్తల బలంతో, మేడ్చల్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో గెలుపు సాధిస్తానని ఏనుగు సుదర్శన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఖాయమని జోష్యం చెప్పారు. మల్లారెడ్డి తన వ్యాపారాలను పెంచుకునేందుకు, కాపాడుకునేందుకే రాజకీయాల్లో కొనసాగుతున్నాడని, తాను మాత్రం ఉన్న ఆస్తులు అమ్ముకొని ప్రజలకు సేవలు అందించానని ఏనుగు సుదర్శన్ రెడ్డి చెప్పారు. ప్రజలకు సేవ చేసే నాలాంటి వ్యక్తి కావాలా లేక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయిన మల్లారెడ్డి కావాలా ప్రజలు ఒక్కసారి ఆలోచించి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. మేడ్చల్ నియోజకవర్గంలో ముఖ్యంగా డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఆశా వర్కర్ల సమస్యలు, దళిత బంధు ఇతర సమస్యలపై మంత్రి మల్లారెడ్డిపై బీఆర్ఎస్ లో ఉండి పోరాడలేకే పార్టీని వీడి బీజేపీలో చేరానన్నారు. ప్రస్తుతం తమ పార్టీలో ఎలాంటి వర్గ పోరు లేదని స్పష్టం చేశారు. అందరం కలిసే గెలుపు దిశగా ముందుకు సాగుతున్నామని ఏనుగు సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ బీజేపీ అధ్యక్షుడు ఆంజనేయులు ముదిరాజ్, సీనియర్ నాయకుడు రామన్న గారి శ్రీనివాస్ గౌడ్, చెరువు కొమ్ము శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి ప్రేమ్ దాస్, అసెంబ్లీ కన్వీనర్ అమరం మోహన్ రెడ్డి, జిల్లా కిసాన్ మోర్చ ఉప అధ్యక్షుడు కృష్ణ గౌడ్, బీజేపీ పార్టీ జిల్లా ఉప అధ్యక్షుడు జగన్ గౌడ్, ప్రభాకర్ రెడ్డి, అర్జున్, వంశీ, మురళి కృష్ణ, మున్సిపల్ బీజేపీ మహిళ నాయకురాలు హేమలత రెడ్డి, జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు