Sunday, May 12, 2024

ప్రజలను ఆకర్షిస్తున్న ప్రభుత్వ పథకాలు..

తప్పక చదవండి
  • అభివృద్ధిని ఆదరిస్తామంటున్న ప్రజలు
  • కడియం శ్రీహరి గెలుపునకు కృషి చేస్తున్న నాయకులు

స్టేషన్ ఘన్పూర్ : బుధవారం నాడు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ లింగాలఘనపూర్ మండలం నెల్లుట్ల గ్రామంలో 217 బూత్ లో జనగామ ఎంపీపీల ఫోరం అధ్యక్షులు, లింగాల ఘణపురం ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డీ ఆధ్వర్యంలో రెండో విడుత ప్రచారంలో భాగంగా గడపగడపకు ఇంటింటి ప్రచారం చేపట్టిన బీఆర్ఎస్ నాయకులకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు అన్నారు. ఈ సందర్భంగా చీట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం పరిచిన సంక్షేమ అభివృద్ధి పథకాలతో తమ లబ్ధి పొందామని ప్రజలు అభివృద్ధిని ఆదరించి భారీ మెజారిటీతో కడియం శ్రీహరిని గెలిపిస్తామని బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారని వారు పేర్కొన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేద ప్రజల సంక్షేమానికి ముఖ్యమంత్రి చేసిన కృషి వారి అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరిస్తూ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు గెలుపు కోసం అలుపెరగకుండా సైనికులుగా పని చేస్తున్నారని . కడియం శ్రీహరి గెలుపు ఖాయమని అన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు మోటే వీరస్వామి మాజీ యం.పి.టి.సి గుర్రం యదగిరి జీడికల్ టెంపుల్ డైరెక్టర్ కొత్తకొండ గోవర్ధన్ , వార్డు మెంబర్ గొరిగే పద్మ పర్వతాలు వార్డు మెంబర్ కడకంచి కావ్య వీరస్వామి పేరబోయిన కుమార్ కొయ్యాడ చంద్రయ్య గౌడ్ మ్యాకపోతుల సత్యనారాయణ , పేరబోయిన మల్లయ్య గొరిగె సత్తయ్య పేరబోయిన సోమ్మయ్య ఓం మల్లయ్య రిజ్వాన్ MD పాషా మరియు ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు