Tuesday, May 14, 2024

మొదటసారి స్పందించిన శిఖర్ ధావన్

తప్పక చదవండి
  • వన్డే వరల్డ్ కప్ కోసం భారత్ ఎంపిక
  • టీమ్‌కు అభినందనలు తెలిపిన గబ్బర్
    వన్డే వరల్డ్ కప్ జట్టు ప్రకటన తర్వాత టీమిండియా వెటరన్ బ్యాటర్ శిఖర్ ధావన్ తొలిసారి స్పందించాడు. జట్టులో చోటు కల్పించకుండా ధావన్‌కు అన్యాయం చేశారని అతడి ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రస్తుత తరుణంలో తన మంచి మనసు చాటుకున్నాడు గబ్బర్. వన్డే వరల్డ్ కప్ కోసం ఎంపికైన భారత్ జట్టుకు అభినందనలు తెలిపాడు. కప్పు తీసుకురండి.. దేశం గర్వపడేలా చేయండి అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అక్టోబర్ 5 నుంచి వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానుంది.
    టీమిండియా వెటరన్ బ్యాటర్ శిఖర్ ధావన్‌ను గత కొన్ని రోజులుగా టీమిండియా జట్టులోకి ఎంపిక చేయడం లేదు సెలక్టర్లు. గతంలో సీనియర్ జట్టు ఇతర దేశాల్లో పర్యటిస్తున్నప్పుడు ద్వితీయశ్రేణి జట్టును నడిపించే బాధ్యతలను ధావన్‌కు అప్పగించేది జట్టు యాజమాన్యం. అయితే ఇటీవల మాత్రం అతడిని పట్టించుకోవడం లేదు. దీంతో ధావన్ అంతర్జాతీయ కెరీర్‌కు ఎండ్ కార్డు పడినట్లే అని అంతా భావిస్తున్నారు. ఈ ఊహాగానాలకు బలం చేకూర్చేలా త్వరలో చైనాలో జరగనున్న ఏషియన్ గేమ్స్‌ కోసం ప్రకటించిన జట్టులోనూ ధావన్‌కు చోటు దక్కలేదు. కానీ వన్డే వరల్డ్ కప్ జట్టులోకైనా తీసుకుంటారా అని ఆశించిన అతడి ఫ్యాన్స్‌కు నిరాశే మిగిలింది. ఇటీవల ప్రకటించిన భారత వన్డే వరల్డ్ కప్ జట్టులో సైతం ధావన్‌ పేరు లేదు. దీంతో అతడి రీఎంట్రీ ఇచ్చే దారులన్నీ మూసుకుపోయినట్లే కనిపిస్తున్నాయి. ఏషియన్ గేమ్స్‌ కోసం ఎంపిక చేసిన జట్టులో తన పేరు లేకపోవడం ఆశ్చర్యం కలిగించిందని గతంలో ధావన్ చెప్పాడు. తాజాగా వన్డే వరల్డ్ కప్ జట్టులోనూ చోటు కోల్పోవడంపై స్పందించాడు. అయితే స్పందనతోనే తన గొప్ప మనసును చాటుకున్నాడు గబ్బర్. ప్రపంచకప్‌ కోసం ఎంపికైన జట్టుకు ధావన్ అభినందనలు తెలిపాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.”వన్డే వరల్డ్ కప్ 2023లో భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించేందుకు ఎంపికైన నా తోటి సహచరులకు, స్నేహితులకు అభినందనలు. 150 కోట్ల మంది ప్రజల ఆశీస్సులు మీకు ఉంటాయి. మీరు ట్రోఫీని సాధించి, మమ్మల్ని గర్వించేలా చేయండి. గో ఆల్ ఔట్. టీమిండియా” అంటూ ధావన్ పోస్టు చేశాడు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు