Wednesday, May 8, 2024

ప్రభుత్వ బోర్డును పీకేయ్‌..సొంత బోర్డు పెట్టెయ్‌..!

తప్పక చదవండి
  • కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి హాంఫట్‌..
  • కబ్జాకోరులకు కొమ్ముకాస్తున్న రెవెన్యూ అధికారులు..
  • ప్రేక్షక పాత్రలో చోద్యం చూస్తున్న మండల తహసిల్దార్‌..
  • సర్వే నెంబర్‌ 170లోని 10 గుంటల ప్రభుత్వ భూమికి ఎసరు..
  • శేరిలింగంపల్లి మండలం, చందా నగర్‌లో వెలుగు చూసిన కబ్జా భాగోతం..
  • కలెక్టర్‌ కల్పించుకుని ప్రభుత్వ భూమిని కాపాడాలంటున్న స్థానికులు..
    అది ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టారు.. బాగానే ఉంది.. బోర్డుతో సరిపెట్టి దానికి రక్షించాల్సిన అధికారు కబ్జా దారులకు కొమ్ముకాస్తూ. తమ విధులను, విలువలను తాకట్టు పెట్టడం శోచనీయం.. రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం, చందానగర్‌ లో కబ్జాకోరులు, కొందరు రెవెన్యూ అధికారులు కలిసి ప్రభుత్వ భూమిని భోంచేస్తున్న వైనం విస్తుపోయేలా చేస్తోంది.. వివరాలు ఒకసారి పరిశీలిద్దాం…

హైదరాబాద్‌ : రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం, చందా నగర్‌ లో కోట్ల రూపాయల విలువగల ప్రభుత్వ భూమి కబ్జాకు గురౌతోంది.. సర్వే నెంబర్‌ 170లో 10 గుంటల ప్రభుత్వ భూమి ఉంది.. గతంలో ఈ స్థలంలో ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టారు రెవెన్యూ అధికారులు.. అయితే ఈ భూమికి ఆనుకుని ఉన్న పట్టా భూముల యజమానులు ఈ భూమిని యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారు… కాగా అధికారులు ఏర్పాటు చేసిన బోర్డును తొలగించి, ప్రయివేట్‌ వ్యక్తులు తమకు సంబంధించిన సూచిక బోర్డు పెట్టుకుని కబ్జాకు తెరలేపినట్లు తెలుస్తోంది.. గతంలో అధికారులు, ఈ ప్రభుత్వ భూమికి సంబంధించిన హద్దులను సర్వే చేసి, హద్దు రాళ్ళను మార్కింగ్‌ చేయవలసిన బాధ్యతగల మండల సర్వేయర్‌ మహేష్‌ ఆ పని చేయకుండా.. ముడుపులు తీసుకొని కబ్జాదారులకు సహకరిస్తున్నాడని విమర్శలు వెలువెత్తుతున్నాయి. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే ప్రభుత్వ భూములు కాపాడవలసిన బాధ్యతగల శేరిలింగంపల్లి మండలం తాసిల్దార్‌, రెవెన్యూ ఇన్స్పెక్టర్‌ శీనయ్య ప్రభుత్వ భూమి కాపాడడంలో నిర్లక్ష్యం వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది.ఈ కబ్జా వ్యవహారంపై తేదీ 21 ఏప్రిల్‌ 2023 ‘‘కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి కైకల్యం’’ అనే శీర్షికతో ఆదాబ్‌ వార్తా కథనం ప్రచురించిన అనంతరం భాను కన్‌ స్ట్రక్షన్స్‌ ఏర్పాటు చేసిన బోర్డును తొలగించడం జరిగింది. కానీ సర్వే నెంబర్‌ 170 లో ఉన్న కంటైనర్‌ ను తీస్తామని రెవెన్యూ ఇన్‌ స్పెక్టర్‌ సీనయ్య పలుమార్లు ఆదాబ్‌ హైదరాబాద్‌ ప్రతినిధితో తెలపడం జరిగింది. కానీ ఆ దిశగా చర్యలు చేపట్టక కబ్జాదారులు విసిరే ఎంగిలి మెతుకులకు ఆశపడి వారికి పూర్తిగా సహకరిస్తున్నట్టు బహిరంగ విమర్శలు వెలువెత్తుతున్నాయి. భాను కన్‌ స్ట్రక్షన్స్‌ కంపెనీ వారు బరితెగించి ఏకంగా ప్రభుత్వం తొలగించిన వారి బోర్డును తిరిగి యధావిధిగా పెట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది.. గతంలో ప్రభుత్వ భూమి కబ్జాకు పాల్పడ్డ కబ్జా దారులపై రెవెన్యూ అధికారులు కఠిన చర్యలు తీసుకోకుండా ఉండడం వలన… మళ్లీ ప్రభుత్వ బోర్డును తొలగించి వారి బోర్డును ఏర్పాటు చేసుకున్నారంటే.. వారికి అధికారులు అండ దండలు ఎంతవరకు ఉన్నాయో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికైనా రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ స్పందించి. ప్రభుత్వ భూమిని కాపాడి. నిర్లక్ష్యం వహించిన సంబంధిత అధికారులపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.భాను కన్‌ స్ట్రక్షన్స్‌ కబ్జా భాగోతం.. వారికి సహరిస్తున్న రెవెన్యూ అధికారులు చరిత్రను పూర్తి ఆధారాలతో మరో కథనం ద్వారా వెలుగులోకి తీసుకుని రానుంది ఆదాబ్‌ హైదరాబాద్‌’.. ‘మా అక్షరం అవినీతిపై అస్త్రం’..

అది ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టారు.. బాగానే ఉంది.. బోర్డుతో సరిపెట్టి దానికి రక్షించాల్సిన అధికారు కబ్జా దారులకు కొమ్ముకాస్తూ. తమ విధులను, విలువలను తాకట్టు పెట్టడం శోచనీయం.. రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం, చందానగర్‌ లో కబ్జాకోరులు, కొందరు రెవెన్యూ అధికారులు కలిసి ప్రభుత్వ భూమిని భోంచేస్తున్న వైనం విస్తుపోయేలా చేస్తోంది.. వివరాలు ఒకసారి పరిశీలిద్దాం…

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు