Wednesday, May 15, 2024

దేశవ్యాప్తంగా 120 మందికి రాష్ట్రీయ గౌరవ్‌ అవార్డు

తప్పక చదవండి
  • వివిధ రంగాల ప్రముఖులచే అవార్డులు అందజేత

హైదరాబాద్‌ : సమాజంలోని వివిధ రంగాలలో కృషి చేసిన వ్యక్తులను గుర్తించి, సత్కరించేందుకు రాష్ట్రీయ గౌరవ్‌ అవార్డ్స్‌ 2023 వేడుకను రెడ్‌ హిల్స్‌, హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి, తెలుగు సినీ నిర్మాత రామ సత్యనారాయణ, సుధాకర్‌ పైపుల మేనేజింగ్‌ డైరెక్టర్‌ జయదేవ్‌ మీలా, డిఫెన్స్‌ ఎస్టేట్స్‌ డైరెక్టర్‌ డి.మధుకర్‌ నాయక్‌, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్స్న ముఖ్య అతిథులుగా పాల్గొని అవార్డు గ్రహీతలకు అవార్డులను అందజేశారు. దేశవ్యాప్తంగా 120 మంది వ్యక్తులకు ఈ అవార్డులు అందజేశారు. సమాజానికి చేసిన ఆదర్శప్రాయమైన సేవలను గుర్తించి వీరిని ఎంపిక చేశారు. అవార్డు గ్రహీతలలో శోభా శెట్టి (బిగ్‌ బాస్‌ ఫేమ్‌), డాక్టర్‌ ఆశ్లేష (కౌన్సిలర్‌), మోనిష్‌ యర్రగుంట్ల (ఇన్వెస్టర్‌), చరణ్‌ లక్కరాజు (స్టూడెంట్‌ ట్రైబ్‌), ప్రఖ్యాత యాంకర్‌ దేవి నాగవల్లి మరియు పలువురు ఉన్నారు. రాష్ట్రీయ గౌరవ్‌ అవార్డ్స్‌ నిర్వాహకులు సాత్విక గుప్తా, అఖిల్‌ సివ్వా మాట్లాడుతూ.. ‘వ్యక్తులను ఆయా విభాగాల్లో రాణించేలా ప్రోత్సహించడమే మా ఉద్దేశం. విశేషమైన వాటిని వెలుగులోకి తీసుకురావాలని మేము విశ్వసిస్తున్నాం అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు