- అడ్డ మహిళా కూలీలే టార్గెట్..
- జైలుకెళ్ళిన తీరుమారని కిల్లర్..
తాండూరు (ఆదాబ్ హైదరా బాద్): వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజ కవర్గంలో సైకో కిల్లర్ దడ పుట్టిస్తున్న. ఈ సైకో కిల్లర్ మహిళలను టార్గెట్ చేస్తూ వారిని తీసుకువెళ్లి హత్య చేస్తున్నట్లుగా తెలుస్తుంది. విశ్వసనీయ సమాచారం మేరకు గత నెల 29వ తేదీన తాండూరు అడ్డా కూలికి వచ్చిన ఓ మహిళ ను సైకో కిష్టయ్య అనే కిల్లర్ ఆమెను చూసి కూలి పని కోసం తీసుకెళ్లాడు దీంతో ఆమెజాడ కనిపించలేదు ఆమె తిరిగి ఇంటికి రాకపోవడం తో అదృష్టమైన మహిళ కుటుంబ సభ్యులు స్థానిక తాండూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిసి కెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభం చేశారు. సిసి పుటేజ్ పరిశీలించిన అనంతరం ధరూర్ మండలం అల్లిపూర్ కిష్టయ్య అనే వ్యక్తి తీసుకొని వెళ్ళిన ట్లుగా అనుమానించారు దీంతో కిష్టయ్య ను అదుపులో తీసుకొని తప్పదైన రితి లో పోలీసులు విచా రణ చేపట్టారు. కిష్టయ్య ఆ మహిళను అటవీ ప్రాంతంలో హత్య చేసినట్లుగా పేర్కొన్నారు దీంతో పెద్దముల్ మండలం తట్టెపల్లి అడవి ప్రాం తంలో పోలీసులు మూడు రోజులపాటు జల్లడ పట్టారు. గురువారం సాయంత్రం సిద్ధమడుగు తాండ అటవీ ప్రాంతంలో కుళ్లిపోయిన మహిళా మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ మహిళ అదృశ్యం అయినా మహిళగా పోలీసులు నిర్ధా రించుకొని పోస్టుమార్టం చేసారు. ఇదిలా ఉంటే కిష్టయ్య గతంలో కూడా వికారాబాద్ యాలాల దారుర్ ప్రాంతాలలో కూలీలకు వచ్చే మహిళలను టార్గెట్ చేసి వారిని తీసుకువెళ్లి నిర్మానుష ప్రదేశంలో హత్య చేసేవాడని తెలుస్తుంది. ఇలా ఇప్పటివరకు జిల్లాలలో నాలుగు హత్య నేరాలుగా కిష్టయ్య పైన ఉన్నట్లుగా సమాచారం. పలు కేసుల కింద జైలుకు పంపించినా కూడా కిష్టయ్య తీరు మారలేదు. మహిళలు తస్మాత్ జాగ్రత్త గా ఉండాలని ఇలాంటి నీచుల ను ఒకవైపు గుర్తించా లని పోలీసులు కూడా నిఘా ప్రతిష్ట చేయాలని పలువురు సమాజ శ్రేయస్సులు పేర్కొంటున్నారు. దీనికి సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొంటున్నారు.