Saturday, April 27, 2024

ఏపీలో పొలిటికల్ వెదర్…

తప్పక చదవండి

ఎన్నికలు సమీపిస్తుండటంలో ఏపీలో పొలిటికల్ వెదర్ హీటెక్కుతోంది. అధికార వైసీపీ నేతలు టీడీపీ చీఫ్ చంద్రబాబే టార్గెట్ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీలోని కీలక నేతలంతా చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ చీఫ్ బాబుపై మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అబద్ధానికి మరో పేరు టీడీపీ అధినేత ‘చంద్రబాబు’ అని ఎద్దేవా చేశారు. పేదలను నమ్మించి మోసం చేసిన చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణనపై చంద్రబాబు అడగలేకే.. పవన్ కల్యాణ్‌తో అడిగించారని ఆరోపించారు. ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కుట్రలు బయటపడ్డాయని అన్నారు. చంద్రబాబు కుట్రలను రాష్ట్ర ప్రజలను గమనిస్తున్నారని.. టీడీపీ, జనసేన ఎన్ని కుట్రలు చేసిన ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వైసీపీ ఘన విజయం సాధిస్తుందని దీమా వ్యక్తం చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు