Thursday, May 2, 2024

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరెంట్ బిల్లులపై కీలక వ్యాఖ్యలు

తప్పక చదవండి

తన నియోజవర్గంలోని ప్రజలు ఎవరు.. కరెంట్ బిల్లులు కట్టవద్దని.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరెంట్ బిల్లులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరైన విద్యుత్ అధికారులు వచ్చి బిల్ కట్టమని అడిగితే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు మాట్లాడిన వీడియోలను చూపించాలని ఎమ్మెల్యే చెప్పుకొచ్చాడు. బుధవారం తన నియోజకవర్గంలో పర్యటించిన కౌశిక్ రెడ్డి.. హుజురాబాద్ పట్టణ కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ఉచిత విద్యుత్ హామీతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని.. వెంటనే ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నేరవేర్చాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు