- ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఆంక్షలు కొనసాగుతాయి
- ఎవ్వరూ చట్ట ఉల్లంఘన చర్యలకు పాల్పడవద్దు…
- జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే..
సూర్యాపేట (ఆదాబ్ హైదరాబాద్) : ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన రోజు నుండి ఇప్పడివరకు జిల్లా పోలీస్ శాఖ పటిష్ట ప్రణాలికతో పని చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసు కోకుండా జిల్లాలో ఎన్నికలకు రక్షణ బందోబస్తు కల్పిస్తూ, ప్రశాంతంగా నిర్వహించాం అని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. ఎన్నికల కౌంటింగ్ ను జిల్లా ఎన్నికల అధికారి, కలక్టర్ వెంకట్రావుతో కలిసి పర్యవేక్షణ చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లా డుతూ ఎన్నికల నిర్వహణకు పోలీసు శాఖకు సహకరించిన ఓటర్లకు, ఉద్యోగులకు, మీడియా ప్రతినిధులకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల బందోబస్తులో అనునిత్యం శ్రమించి పని చేసిన జిల్లా పోలీసు సిబ్బందిని అభినందిస్తున్నమన్నారు.ఎన్నికలు,ఓట్ల లెక్కింపు అంతా ప్రశాంతంగా జరిగాయని, ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున జిల్లాలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఆంక్షలు కొనసాగుతాయి నిఘా, పెట్రోలింగ్, తనిఖీలు కొనసాగిస్తాం అని ఎస్పీ అన్నారు. ఎవ్వరూ కూడా చట్ట ఉల్లంఘన చర్యలకు పాల్పడవద్దు అని ఎస్పీ కోరారు.