- సంచలన వ్యాఖ్యలు చేసిన రాజా సింగ్..
- ముస్లింల పేరుచెప్పుకుని పబ్బం
గడుకునే పార్టీ ఎం.ఐ.ఎం. - ఏ పార్టీ అధికారంలో ఉంటే వారి కాళ్ళు
పట్టుకునే రకం అసదుద్దీన్..
హైదరాబాద్ : అసదుద్దీన్ గోషామహల్ లో ఎం.ఐ.ఎం. అభ్యర్థిని ఎందుకు పెట్టడం లేదని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారని.. రేవంత్ రెడ్డి ప్రశ్నకు ఒవైసీ స్పందించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు.. ముస్లింలు నాశనం కావడానికి కారణం ఒవైసీ అని కానీ వాళ్ళు మాత్రం ముస్లింల పేరు చెప్పుకుని మస్తుగా పైసల్ సంపాదిస్తున్నారని ఆయన మండిపడ్డారు.. అయితే తాను మాత్రం ముస్లింల ఓట్లు అడుగనని, వారి ఓట్లు అసలు తనకు వద్దని ఖరాఖండిగా తేల్చి చెప్పారు.. ఒవైసీ మాత్రం ఏ పార్టీ అధికారంలో ఉంటే వారి కాళ్ళు పట్టుకుని పబ్బం గడుపుతాడని తీవ్రంగా విమర్శించారు రాజాసింగ్..