- తేల్చిచెప్పిన నీలం మధు ముదిరాజ్..
- సికింద్రాబాద్ పెరేడ్ గౌండ్స్ లో గ్రాండ్ గా ముదిరాజుల ఆత్మగౌరవ సభ..
- ముఖ్య అతిధిగా పాల్గొన్న నీలం మధు..
- సభకు హాజరైన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్..
హైదరాబాద్ : బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఏపార్టీ అయినా మా ముదిరాజ్లను గుండెలో పెట్టుకుని ఎవరు ఎన్ని ఎక్కువ సీట్లు ఇస్తారో రావాలని వారితోనే పొత్తు పెట్టుకుని ఆపార్టీతోనే ఉంటామని ముదిరాజ్ సంఘం రాష్ర్ట నాయకులు నీలంమధు ముదిరాజ్ అన్నారు. సికింద్రాబాద్ పేరేడ్ మైదానంలో నిర్వహించిన ముదిరాజ్ల ఆత్మగౌరవ సభకు ఆయన అతిధిగా పాల్గొని మాట్లాడారు. ముదిరాజ్లకు ఎన్నిసీట్లు ఇస్తారో రండి వారివెంటే మా ముదిరాజ్లు అందరూ నడుస్తామన్నారు. ఆరోజు తెలంగాణ ఆత్మగౌరవం కోసం ఎలా పోరాడామో.. అదే ఆత్మగౌరవం ముదిరాజ్ జాతికి కూడా కావాలని పోరాడతామన్నారు. బీసీల్లో 60 లక్షల మంది ఉన్న ముదిరాజ్లను రాజకీయ గుర్తింపు లేదా..? మేము బ్రతకలేం అనుకుంటున్నారా..? తెలంగాణలో, వేరే రాష్ర్టంలో పుట్టి వచ్చినామనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ముదిరాజ్ బిడ్డలకు భవనాలు, చేపపిల్లలు ఇవ్వడం కాదని, రాజ్యాధికారం దిశగా మేము ఎదగాలని ఆయన అన్నారు. మా ఓటు మేమే వేసుకుంటామని, మద్యం, డబ్పు, ప్రలోభాలకు గురిచేసినా తీసుకోవాలని పోలింగ్ బూత్కు పోయిన రోజు జనగణమణ అని ఓటు వేయాలన్నారు. ముదిరాజ్ బిడ్డలు ఎక్కడ నిలబడితే వారికే ఓటువేయాలన్నారు. మా ఆత్మగౌరవం నిలబెట్డండి అని, సబ్బండ వర్గాలకు చెందిన కులాలను కలుపుకుని వారిని కోరుకుందామని అన్నారు. ముదిరాజ్లు అంతా ఐక్యంగా పోరాడాలని నీలం మధు పిలుపునిచ్చారు..