Monday, May 20, 2024

స్వతంత్ర అభ్యర్థిగా మదన్ మోహన్ నామినేషన్‌ దాఖలు

తప్పక చదవండి

జనగామ : తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. నామినేషన్ల దాఖలు చేసేందుకు రెండు రోజులే గడువు ఉండటంతో పార్టీ నేతలతో పాటు స్వతంత్రులు నామినేషన్లు సమర్పిస్తున్నారు. ఇప్పటికే వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అయితే జనగామ నియోజకవర్గంలో సాదం మదన్ మోహన్ యాదవ్ స్వతంత్ర అభ్యర్థిగా జనగామ ఆర్ డి ఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మద్దతుదారులు ముక్క స్వామి, మేకల కరుణాకర్, చెరుకూరి అనిల్, మునిగే కరుణాకర్, సాయి కిరణ్, మధు లతో పాటు 50 మంది నిరుద్యోగ యువకులు తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు