Wednesday, May 15, 2024

ప్రేమ వ్యవహారమే కారణమం

తప్పక చదవండి
  • చంపాపేట్ స్వప్న మర్డర్ కేసులో ట్విస్ట్
  • పెళ్లికి ముందే మరో యవకుడితో ప్రేమాయణం!
  • అతడే ఆమెను చంపినట్లుగా అనుమానం

హైదరాబాద్ : చంపాపేట యువతి హత్య కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రేమ వివాహమే ఈ దారుణానికి కారణమని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. హత్యకు గురైన యువతి పేరు స్వప్న అని, ఇటీవలే ఆమెకు ప్రేమ్ కుమార్ అనే యువకుడితో వివాహం జరిగిందని చెప్పారు. గతంలో సతీశ్ అనే యువకుడిని స్వప్న ప్రేమించిందని, పెళ్లి తర్వాత కూడా అతడితో కాంటాక్ట్ లో ఉండడమే గొడవలకు దారితీసిందని, మాజీ ప్రియుడే ఆమెను హత్య చేశాడని తెలిపారు. చంపాపేట్‌ వారు అద్దెకు ఉన్న నివాసానికి సతీష్ తరచూ వచ్చేవాడని తెలిసింది. మాజీ ప్రియుడు సతీష్ వ్యవహారంలో స్వప్నకు ఆమె బర్త ప్రేమ్‌కు మధ్య ఇటీవల మనస్పర్థలు, గొడవలు కూడా జరిగినట్లు తెలిసింది. శనివారం ఉదయం 11:30 గంటలకు స్వప్న ఇంటికి సతీష్, అతని మిత్రుడు వచ్చినట్లు సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించారు. సతీషే స్వప్న గొంతు కోయంతో పాటు భర్త ప్రేమ్ కుమార్‌ను రెండో అంతస్తు నుంచి తోసేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ప్రేమ్ కుమార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. అతడి వాంగ్మూలం నమోదు చేసుకుంటే అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రేమ్ కుమార్.. ఉస్మానియా ఆసుపత్రిలోని ఐసీయులో కోమాలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. స్వప్న తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మూడు బృందాలుగా ఏర్పడి వివిధ కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

అన్నాచెల్లెళ్లమని చెప్పి..
మహబూబ్‌నగర్ హన్వాడ తండాకి చెందిన స్వప్న (21), ప్రేమ్ కుమార్ కలిసి చంపాపేటలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. అయితే.. వారు రహస్యంగా పెళ్లిచేసుకోగా.. యజమానులకు తాము అన్నాచెల్లెలు అని చెప్పారు. గత కొన్నాళ్లుగా స్వప్న గదికి మరికొందరు యువకులు కూడా వచ్చి పోయేవారు. శనివారం ఉదయం భర్త ప్రేమ్ కుమార్‌తో పాటు మరో ఇద్దరు యువకులు స్వప్న గదికి వచ్చారు. కాసేపటికి.. ప్రేమ్ కుమార్ బిల్డింగ్ మీది నుంచి కిందపడటాన్ని ఇంటి ఓనర్‌ గుర్తించాడు. ఏంటా అని యజమాని చూడగా.. ఇద్దరు యువకులు పారిపోతూ కనిపించారు. గదిలో రక్తపు మడుగులో స్వప్న కొట్టుమిట్టాడుతూ కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. ప్రేమ్ కుమార్‌ను ఆసుపత్రికి తరలించారు. స్వప్న మృతదేహాన్ని శవ పరీక్షల నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఆసుపత్రిలో ఉన్న భర్త ప్రేమ్ కుమార్ నోరు విప్పితే అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు