Wednesday, May 15, 2024

న్యూజిలాండ్-పాకిస్థాన్ మ్యాచ్ కు అంతరాయం

తప్పక చదవండి
  • వర్షం వల్ల పాకిస్థాన్ టార్గెట్ ను కుదించిన అంపైర్లు
  • 50 ఓవర్లలో 6 వికెట్లకు 401 పరుగులు చేసిన కివీస్

బెంగళూరులో వర్షం కురవడంతో న్యూజిలాండ్-పాకిస్థాన్ మ్యాచ్ కు అంతరాయం ఏర్పడింది. 402 పరుగుల భారీ లక్ష్యఛేదనలో పాక్ 21.3 ఓవర్లలో 1 వికెట్ కు 160 పరుగులు చేసిన దశలో వర్షం రావడంతో మ్యాచ్ నిలిచిపోయింది. దాదాపు గంట పాటు వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయింది. దాంతో అంపైర్లు ఓవర్లను 41కి కుదించారు. పాక్ సాధించాల్సిన లక్ష్యాన్ని 342 పరుగులుగా నిర్దేశించారు. ఆ లెక్కన పాక్ ఇంకా 19.3 ఓవర్లలో 182 పరుగులు చేయాల్సి ఉంటుంది. మరికాసేపట్లో మ్యాచ్ తిరిగి ప్రారంభం కానుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు